జమ్మూకాశ్మీర్ను వరదలు విడిచిపెట్టడం లేదు. కనీసం తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బతో క్లౌడ్ బరస్ట్లతో ప్రజలను బెంబేలెత్తించేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు.. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. Also Read:Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ‘గోట్’…
Jammu Kashmir : భారీ వర్షాల తర్వాత పర్నోట్లో కొండచరియలు విరిగిపడటం శనివారం మూడో రోజు కొనసాగింది. ఇదిలా ఉండగా, బాధిత కుటుంబాలను తాత్కాలికంగా కమ్యూనిటీ సెంటర్ రాంబన్, బంధువులు, పొరుగువారి ఇళ్లకు తరలించారు.
Road Accident : శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, రాంబన్ సివిల్ క్యూఆర్టి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భారీ మాదకదవ్యాల కుట్ర భగ్నమైంది. నార్కో-టెర్రర్ కుట్రను పోలీసులు ఛేదించారు. రాంబన్ జిల్లాలో ఒక వాహనం నుంచి రూ. 300 కోట్ల విలువైన 30 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ రాంబన్ ఖూలీనలాలో నిర్మాణంలో ఉన్న సొరంగం శుక్రవారం కూలింది. జమ్మూ- శ్రీనగర్ మార్గంలో హైవే నిర్మాణ పనుల్లో భాగంగా చేపడుతున్న సొరంగం నిర్మాణం కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న10 మంది కూలీలు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. దీంతో అందులో పని చేస్తున్న పది మంది కూలీలు…