Road Accident : జమ్మూ శ్రీనగర్ హైవే పై ఘోర ప్రమాదం… లోయలో పడి 10మంది మృతి
Road Accident : శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, రాంబన్ సివిల్ క్యూఆర్టి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బృందం సహాయక చర్యలు ప్రారంభించింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ప్యాసింజర్ క్యాబ్ రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లోతైన గుంటలో పడిపోయిందని చెబుతున్నారు. క్యాబ్లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు మరణించే అవకాశం ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, సివిల్ క్యూఆర్టి బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. తెల్లవారుజామున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన బృందం, ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. కానీ ఆ ప్రాంతం లోతుగా, చీకటిగా ఉంది. నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి.
Read Also:BRS KTR: బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ ప్రమాదం గురించి తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. జమ్మూ నుంచి కాశ్మీర్కు ప్రయాణికులతో వెళ్తున్న ట్యాక్సీ (తవేరా) జాతీయ రహదారి-44లోని బ్యాటరీ చష్మా సమీపంలో సుమారు 300 మీటర్ల లోతులో ఉన్న గోతిలో పడిపోయినట్లు సమాచారం. ఎస్హెచ్ఓ పిఎస్ రాంబన్, పోలీసు బృందం, ఎస్డిఆర్ఎఫ్ బృందం, సివిల్ క్యూఆర్టి రాంబన్తో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు లోతైన గోతిలో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలు ఇబ్బందిగా మారాయి.
#WATCH रामबन इलाके में बैटरी चश्मा के पास जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर एक यात्री टैक्सी गहरी खाई में गिर गई। पुलिस, SDRF और रामबन सिविल QRT मौके पर मौजूद हैं और बचाव अभियान जारी है: जम्मू-कश्मीर पुलिस pic.twitter.com/tzSYtMy1T5
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
Read Also:Seema Haider : తన పై భర్త కోర్టులో పిటిషన్.. దేనికైనా రె‘ఢీ’ అంటున్న సీమా హైదర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లోయ నుండి వెలికితీసిన రెండు మృతదేహాలను జమ్మూలోని అంబ్ ఘోర్తా నివాసి పురబ్ సింగ్ కుమారుడు బల్వాన్ సింగ్గా గుర్తించారు. అతను కారు డ్రైవర్. మరొక వ్యక్తి బీహార్ చంపారన్ నివాసి విశ్వనాథ్ ముఖియా కుమారుడు విపిన్ ముఖియాగా గుర్తించారు. రాంబన్ రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న అనంతరం డీసీ రాంబన్ బసీర్ ఉల్ హక్తో మాట్లాడానని, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!