Road Accident : జమ్మూ శ్రీనగర్ హైవే పై ఘోర ప్రమాదం… లోయలో పడి 10మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident : శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, రాంబన్ సివిల్ క్యూఆర్టి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బృందం సహాయక చర్యలు ప్రారంభించింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ప్యాసింజర్ క్యాబ్ రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లోతైన గుంటలో పడిపోయిందని చెబుతున్నారు. క్యాబ్లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు మరణించే అవకాశం ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, సివిల్ క్యూఆర్టి బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. తెల్లవారుజామున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన బృందం, ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. కానీ ఆ ప్రాంతం లోతుగా, చీకటిగా ఉంది. నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి.
Read Also:BRS KTR: బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈ ప్రమాదం గురించి తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. జమ్మూ నుంచి కాశ్మీర్కు ప్రయాణికులతో వెళ్తున్న ట్యాక్సీ (తవేరా) జాతీయ రహదారి-44లోని బ్యాటరీ చష్మా సమీపంలో సుమారు 300 మీటర్ల లోతులో ఉన్న గోతిలో పడిపోయినట్లు సమాచారం. ఎస్హెచ్ఓ పిఎస్ రాంబన్, పోలీసు బృందం, ఎస్డిఆర్ఎఫ్ బృందం, సివిల్ క్యూఆర్టి రాంబన్తో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు లోతైన గోతిలో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలు ఇబ్బందిగా మారాయి.
#WATCH रामबन इलाके में बैटरी चश्मा के पास जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर एक यात्री टैक्सी गहरी खाई में गिर गई। पुलिस, SDRF और रामबन सिविल QRT मौके पर मौजूद हैं और बचाव अभियान जारी है: जम्मू-कश्मीर पुलिस pic.twitter.com/tzSYtMy1T5
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
Read Also:Seema Haider : తన పై భర్త కోర్టులో పిటిషన్.. దేనికైనా రె‘ఢీ’ అంటున్న సీమా హైదర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లోయ నుండి వెలికితీసిన రెండు మృతదేహాలను జమ్మూలోని అంబ్ ఘోర్తా నివాసి పురబ్ సింగ్ కుమారుడు బల్వాన్ సింగ్గా గుర్తించారు. అతను కారు డ్రైవర్. మరొక వ్యక్తి బీహార్ చంపారన్ నివాసి విశ్వనాథ్ ముఖియా కుమారుడు విపిన్ ముఖియాగా గుర్తించారు. రాంబన్ రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న అనంతరం డీసీ రాంబన్ బసీర్ ఉల్ హక్తో మాట్లాడానని, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!