Jammu Kashmir: సొరంగం కూలి ప్రమాదం… మొత్తం 10 మంది కూలీల దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ రాంబన్ ఖూలీనలాలో నిర్మాణంలో ఉన్న సొరంగం శుక్రవారం కూలింది. జమ్మూ- శ్రీనగర్ మార్గంలో హైవే నిర్మాణ పనుల్లో భాగంగా చేపడుతున్న సొరంగం నిర్మాణం కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న10 మంది కూలీలు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. దీంతో అందులో పని చేస్తున్న పది మంది కూలీలు చిక్కుకుపోయారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్న మరో ముగ్గురు కూలీలను మాత్రం రెస్క్యూ సిబ్బంది రక్షించింది.
శుక్రవారం నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. అయితే శిథిలాల కింద చిక్కుకున్న కూలీలంతా ఊపిరాడక పోవడంతో చిక్కుకున్న కూలీలంతా మరణించారు. ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా… మరో మృతదేహం కోసం రెస్క్యూ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
కూలీలను రక్షించేందుకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించించారు. స్వయంగా రక్షణ చర్యలను పర్యవేక్షించారు. అయినా కూడా కూలీల ప్రాణాలు దక్కలేదు. మరణించిన కూలీల 9 మందిలో ఐదుగురు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కాగా… ఒకరు అస్సాం, ఇద్దరు నేపాల్ కు చెందిన వారు కాగా… ఇద్దరు స్థానిక కూలీలు. అయితే నిర్లక్ష్యానికి కారణం అయిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాంబన్ ఎస్ఎస్పీ మోహిత శర్మ వెల్లడించారు.
చనిపోయిన వారినిలో పశ్చిమ బెంగాల్కు చెందిన జాదవ్ రాయ్ (23), గౌతమ్ రాయ్ (22), సుధీర్ రాయ్ (31), దీపక్ రాయ్ (33), పరిమల్ రాయ్ (38), అస్సాంకు చెందిన శివ చౌన్ (26)గా గుర్తించారు. నేపాల్కు చెందిన నవరాజ్ చౌదరి (26), కుషి రామ్ (25), స్థానికులు ముజఫర్ (38), ఇస్రత్ (30)లు ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..