Rajnath Singh: ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి ఆందోళన..
- వైట్ కాలర్ టెర్రరిజంపై రాజ్నాథ్ సింగ్ ఆందోళన..
- విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన రక్షణ మంత్రి..
Rajnath Singh: దేశంలో ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’ ఆందోళన కలిగిస్తోందని, విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ను ఆయన ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు, కుట్రదారులు అంతా హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులుగా తేలింది. నవంబర్ 10న ఎర్రకోట పేలుడుకు పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. మరో ముగ్గురు వైద్యులు ముజమ్మిల్ గనాయ్, అదీల్ రథర్, షహీనా సయీద్తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
“ఈ రోజు దేశంలో వైట్-కాలర్ ఉగ్రవాదం అనే ఆందోళనకరమైన ధోరణి వెలుగులోకి వస్తోంది. ఉన్నత విద్యావంతులు సమాజానికి మరియు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు” అని ఉదయ్పూర్లో జరిగిన భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాజ్నాథ్ అన్నారు. “(ఢిల్లీ) బాంబు పేలుడుకు పాల్పడిన వారు వైద్యులు – ప్రిస్క్రిప్షన్లపై ‘Rx’ అని రాసేవారు, కానీ వారి చేతుల్లో RDX ఉంది. ఇది జ్ఞానంతో పాటు విలువలు, నైతికత కూడా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది” అని అన్నారు. చదువు ఉద్దేశం కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, మానవ వ్యక్తిత్వ వికాసం అని కూడా ఆయన అన్నారు.
రాబోయే 15-20 సంవత్సరాలలో, భారతదేశం ఆయుధాలలో పూర్తిగా స్వావలంబన చెందుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏఐ, మెషిన్ లర్నింగ్, ఇతర సాంకేతికతను భారత అభివృద్ధిని ముందుకు నడిపించడానికి ఉపయోగించుకోవాలని అన్నారు. భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని రాజ్నాథ్ సింగ్ చెబుతూ.. యూనివర్సిటీలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆత్మగౌరవ భావన, ఎప్పుడూ అహంకారంగా మారొద్దని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?