Rajnath Singh: ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి ఆందోళన..
- వైట్ కాలర్ టెర్రరిజంపై రాజ్నాథ్ సింగ్ ఆందోళన..
- విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన రక్షణ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: దేశంలో ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’ ఆందోళన కలిగిస్తోందని, విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ను ఆయన ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు, కుట్రదారులు అంతా హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులుగా తేలింది. నవంబర్ 10న ఎర్రకోట పేలుడుకు పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. మరో ముగ్గురు వైద్యులు ముజమ్మిల్ గనాయ్, అదీల్ రథర్, షహీనా సయీద్తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.
Also Read
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
“ఈ రోజు దేశంలో వైట్-కాలర్ ఉగ్రవాదం అనే ఆందోళనకరమైన ధోరణి వెలుగులోకి వస్తోంది. ఉన్నత విద్యావంతులు సమాజానికి మరియు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు” అని ఉదయ్పూర్లో జరిగిన భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాజ్నాథ్ అన్నారు. “(ఢిల్లీ) బాంబు పేలుడుకు పాల్పడిన వారు వైద్యులు – ప్రిస్క్రిప్షన్లపై ‘Rx’ అని రాసేవారు, కానీ వారి చేతుల్లో RDX ఉంది. ఇది జ్ఞానంతో పాటు విలువలు, నైతికత కూడా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది” అని అన్నారు. చదువు ఉద్దేశం కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, మానవ వ్యక్తిత్వ వికాసం అని కూడా ఆయన అన్నారు.
రాబోయే 15-20 సంవత్సరాలలో, భారతదేశం ఆయుధాలలో పూర్తిగా స్వావలంబన చెందుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏఐ, మెషిన్ లర్నింగ్, ఇతర సాంకేతికతను భారత అభివృద్ధిని ముందుకు నడిపించడానికి ఉపయోగించుకోవాలని అన్నారు. భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని రాజ్నాథ్ సింగ్ చెబుతూ.. యూనివర్సిటీలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆత్మగౌరవ భావన, ఎప్పుడూ అహంకారంగా మారొద్దని చెప్పారు.
తాజావార్తలు
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!