Sonia Gandhi: నెహ్రూను కించపరచడమే బీజేపీ లక్ష్యం..
- నెహ్రూ వారసత్వాన్ని తుడిచే ప్రయత్నం..
- బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై సోనియా గాంధీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
బీజేపీ, ఆర్ఎస్ఎస్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యంలో కానీ, రాజ్యాంగ రచనలో కానీ పాత్ర లేని శక్తులు నెహ్రూపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. వీరి భావజాలం ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించిందని, చివరకు మహాత్మా గాంధీ హత్యకు దారితీసిందని, నేటికి గాంధీ హంతకులను కీర్తిస్తున్నారని, ఇది మతతత్వ దృక్పథం కలిగిన భావజాలం అని అన్నారు.
నెహ్రూ జీవితాన్ని పరిశీలించడం, విమర్శించడం సహజమేనని, కానీ ఆయన మాటలు, రచనలు, వారసత్వాన్ని తారుమారు చేసి, చెడగొట్టే ప్రయత్నం జరుగుతుండటం అసహ్యకరమని సోనియా అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మాణానికి నెహ్రూ ప్రజాధనాన్ని వాడేందుకు సిద్ధమయ్యారని, అయితే సర్దార్ పటేల్ అడ్డు చెప్పారని అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తర్వాత సోనియా గాంధీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!