Sonia Gandhi: నెహ్రూను కించపరచడమే బీజేపీ లక్ష్యం..
- నెహ్రూ వారసత్వాన్ని తుడిచే ప్రయత్నం..
- బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై సోనియా గాంధీ ఆరోపణలు..
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
బీజేపీ, ఆర్ఎస్ఎస్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యంలో కానీ, రాజ్యాంగ రచనలో కానీ పాత్ర లేని శక్తులు నెహ్రూపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. వీరి భావజాలం ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించిందని, చివరకు మహాత్మా గాంధీ హత్యకు దారితీసిందని, నేటికి గాంధీ హంతకులను కీర్తిస్తున్నారని, ఇది మతతత్వ దృక్పథం కలిగిన భావజాలం అని అన్నారు.
నెహ్రూ జీవితాన్ని పరిశీలించడం, విమర్శించడం సహజమేనని, కానీ ఆయన మాటలు, రచనలు, వారసత్వాన్ని తారుమారు చేసి, చెడగొట్టే ప్రయత్నం జరుగుతుండటం అసహ్యకరమని సోనియా అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మాణానికి నెహ్రూ ప్రజాధనాన్ని వాడేందుకు సిద్ధమయ్యారని, అయితే సర్దార్ పటేల్ అడ్డు చెప్పారని అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తర్వాత సోనియా గాంధీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!