రాజస్థాన్ లోని జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా ఈము కోడి, నిప్పు కోడి రెక్కలు, ఓ తలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుండి లండన్ వెళుతున్న రెండు పార్సల్ లో నిప్పు కోడికి సంబంధించిన రెక్కలు, తల భాగమును కస్టమ్స్ అధికారుల బృందం గుర్తించింది. ఏమాత్రం అనుమానం రాకుండా కొరియర్ ద్వారా విదేశాలకు పక్షుల రెక్కలు తరలిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలకు విరుద్దంగా స్మగ్లింగ్ కు తెరలేపిన ఈ కేటుగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు…
ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలనుకుంది భార్య.. ప్లాన్ ప్రకారం అతడు తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అయినా చావకపోవడంతో కరెంటు షాకిచ్చి చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బిజ్జూ గ్రామంలో జరిగింది. అయితే భర్త మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేసింది. కాగా, సునీత భర్త బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తను చంపడానికి ప్రియుడు నిహాల్ సింగ్తో కలిసి సునీతే పథకం వేసిందని తెలిసి బంధువులు షాక్…
ఆడవాళ్లపై లైంగికదాడుల కేసుల్లో కొత్త కొత్త తరహా ఘటలు వెలుగు చూస్తుంటాయి.. పసిగొడ్డు నుంచి వృద్ధురాలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. తాజాగా రాజస్థాన్లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టిస్తోంది.. మహిళకు చెందిన ఓ అస్యకరమైన వీడియో దొరకడంతో.. ఆ వీడియో చూపిస్తూ.. రెండేళ్లుగా.. ముగ్గురు యువకులు 20 ఏళ్ల మహిళలను చిత్ర హింసలకు గురిచేశారు.. వారికి కావాల్సినప్పుడల్లా.. ఆమె కోరికి తీర్చాల్సిందే.. లేదంటే.. వీడియో బయట పెడతామని బ్లాక్ మెయిల్.. కొన్నిసార్లు సామూహిక అత్యాచారానికి…
కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. టీకాల విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం టీకా విషయంలో కీలకమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలి అంటే తప్పని సరిగా ఒక డోసు టీకా తీసుకొని ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read: 7 రొటీన్ స్టెప్స్…
భారతీయ జనా పార్టీకి చెందిన మహిళా ఎంపీ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లు, రాడ్లతో విరిచుకుపడ్డారు.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ఆమె.. సొమ్మసిల్లిపడిపోయారు.. ఈ ఘటన రాజస్థాన్లో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్ ఎంపీ రంజీతా కోలీ.. త రాత్రి ధర్సోనీ గ్రామంలో ఓ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు.. తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో భరత్పూర్ జిల్లాలోని ధర్నోనీకి వెళ్తుండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, ఐరన్…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో… దానిబారినపడి కోలుకున్న వారిపై ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి… తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి.. అయితే, ఈ సమయంలో.. బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా ప్రకటించింది రాజస్థాన్ సర్కార్.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడగా.. వీరి చికిత్స కోసం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.…