మొన్న పంజాబ్ ఇప్పుడు రాజస్థాన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టి, అందర్ని ఏకం చేసేలా, అందరి మధ్య రాజీ కుదిర్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. పంజాబ్లో ఈ విషయంలో దాదాపుగా విజయం సాధించిందని చెప్పాలి. పంజాబ్లో ముఖ్యనేతలైన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించింది. సిద్ధూకు పంజాబ్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో అక్కడ సమస్య చాలా వరకు ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా రాజస్థాన్లో ఉన్న అంతర్గత సమస్యలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నది. సచిల్ పైలట్ వర్గానికి చెందిన జితిన్ ప్రసాద్ ఇటీవలే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.
Read: ప్రముఖ నటికి కారు ప్రమాదం… స్నేహితురాలు మృతి
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ తన క్యాబినెట్ను పునఃవ్యవస్థీకరణ చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. పార్టీని వీడీ బయటకు వెళ్లాలనుకునే వారిని బుజ్జగించి పదవులు అప్పగించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని పార్టీ భావిస్తున్నది. కొన్ని రోజుల కిందట సచిన్ పైలట్, అనుచరులు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించడంతో అప్పట్లో ఆ సమస్యకు చెక్ పడింది. కాగా,ఇప్పుడు మరోసారి రాష్ట్ర కాంగ్రెస్లో మళ్లీ కీచులాటలు మొదలు కావడంతో వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 27 లేదా 28 వ తేదీన క్యాబినెట్ను విస్తరిస్తారని వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!