PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
రాజస్థాన్ క్యాబినెట్ నుంచి తొలిగించబడిని మంత్రి రాజేంద్ర గుడా గతంలో ముఖ్యమంత్రి ఆర్థిక లావాదేవీలు రెడ్ డైరీలో నమోదయ్యాయని ఆరోపించడాన్ని మోడీ ప్రస్తావించారు. రైతులు, సైనికులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వారికి కుర్చీ తప్ప మరేది కనిపించదని, ప్రజల ప్రయోజనాల కంటే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకునను ఎక్కువగా ప్రేమిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
Read Also: Putin: ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి.. రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..
జోధ్పూర్ లో రూ. 5000 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం అశోక్ గెహ్లాట్ గైర్హాజరయ్యారు. దీనిపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ వస్తే అంతా బాగానే ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు అనుకుంటారని ఎద్దేవా చేశారు. అంతా మేం చూసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండని గెహ్లాట్ కి చురకలు అంటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతూ.. మహిళలు, దళితులపై అత్యాచారాలను ప్రస్తావించారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ తో పాటు తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!