PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
రాజస్థాన్ క్యాబినెట్ నుంచి తొలిగించబడిని మంత్రి రాజేంద్ర గుడా గతంలో ముఖ్యమంత్రి ఆర్థిక లావాదేవీలు రెడ్ డైరీలో నమోదయ్యాయని ఆరోపించడాన్ని మోడీ ప్రస్తావించారు. రైతులు, సైనికులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వారికి కుర్చీ తప్ప మరేది కనిపించదని, ప్రజల ప్రయోజనాల కంటే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకునను ఎక్కువగా ప్రేమిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also: Putin: ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి.. రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..
జోధ్పూర్ లో రూ. 5000 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం అశోక్ గెహ్లాట్ గైర్హాజరయ్యారు. దీనిపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ వస్తే అంతా బాగానే ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు అనుకుంటారని ఎద్దేవా చేశారు. అంతా మేం చూసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండని గెహ్లాట్ కి చురకలు అంటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతూ.. మహిళలు, దళితులపై అత్యాచారాలను ప్రస్తావించారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ తో పాటు తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!