Rajasthan News: నిద్రపోతున్న తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న.. పంట విషయంలో ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని భరత్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ్ముడిని తన అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా గ్రామంలో జరిగింది. వీరిద్దరి మధ్య పంటల పంపిణీపై అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు. మినుము పంటను కోసి ఇంటికి తీసుకువచ్చాడని.. ఈ కారణంగా మద్యం మత్తులో ఇద్దరు సోదరులు గొడవ పెట్టుకున్నారు. అయితే గొడవ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులంతా నిద్రలోకి జారిపోయారు. గొడవ నేపథ్యంలో కక్ష పెట్టుకున్న అన్న లోకేశ్.. తన తమ్ముడు ధన్వీర్ తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత అన్న పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇవ్వకుండానే.. ధన్వీర్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత మృతుడి తండ్రి పురాణ్సింగ్ పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.
Bandla Ganesh: కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత బండ్ల గణేష్.. ఆయన రియాక్షన్ ఇదే..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈ ఘటనపై మృతుడి తండ్రి స్పందించారు. అర్థరాత్రి లోకేశ్, ధన్వీర్ల మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఈ క్రమంలో లోకేష్ పదునైన ఆయుధంతో ధన్వీర్ తలపై దాడి చేశాడని.. ఆ సమయంలో తాము నిద్రపోతున్నట్లు చెప్పాడు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. తఖా గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందిందని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రాకేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటన గురించి ఎవరికీ తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారని.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూడగా తలపై బలమైన గాయం ఉందన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించామని.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Tags
- brother
- Crime News
- Crop
- death
- murder
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!