Rahul Gandhi: రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు పడిపోతాయి.. నోరుజారిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తప్పును గ్రహించి నాలుక కరుచుకున్నాడు. బీజేపీ ఓడిపోతుందని తన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సవరించుకున్నారు.
Also Read: World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఎంత మంది సెక్యూరిటీ తెలుసా..?
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్గాంధీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ సర్కారు ఉందని ఈ ఎన్నికలతో అక్కడ సర్కారు మారిపోతుందని చెప్పారు. అదేవిధంగా రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కూడా ప్రభుత్వాలు మారిపోతాయని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కారు మారుతుందని చెప్పిన రాహుల్.. అదే ఫ్లోలో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లో ప్రభుత్వాలు మారిపోతాయని చెప్పారు. ఆ తర్వాత తప్పును గుర్తించి.. సారీ సారీ తప్పుగా చెప్పానంటూ తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు.
Also Read: Election Code : అమల్లోకి ఎలక్షన్ కోడ్.. హైదరాబాద్లో పలు ప్రాంతలో పోలీసుల విస్తృత తనిఖీలు
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీలకు నవంబర్ 7 నుంచి 30 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 23న, తెలంగాణలో నవంబర్ 30న, మిజోరాంలో నవంబర్ 7న ఒకే దశ.. ఛత్తీస్గఢ్లో నవంబర్ 7న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!