బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, కుత్భుల్లాపూర్, అంబర్పేట్ తో పాటుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టుప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తుఫాన్…
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా…
బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారనుంది తీవ్ర వాయుగుండం. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో గంటకు 17కి.మీ వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండంతుఫాన్ గా మారి రేపు సాయంత్రం కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటుతుందని హెచ్చరికలు జారీ చేసారు వాతావరణ అధికారులు. గోపాల్పూర్ (ఒడిశా) కి తూర్పు-ఆగ్నేయంగా 410 కి.మీ &కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పు-ఈశాన్యంలో 480 కి.మీ.దూరంలో కొనసాగుతుంది తీవ్ర వాయుగుండం. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాని ప్రభావం మొదలైంది. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు…
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ రోజు రాత్రికి అది తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని… దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు…
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 1లక్ష 69వేళా క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా 1లక్ష 49 వేళా క్యూస్సేక్కులకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కులు… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు.. అలాగే లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ ద్వారా 9700 క్యూస్సేక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు…
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని చెప్పింది. ఇక బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు…
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక,ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అంబర్పేట్, రాంనగర్, దోమలగూడ, చిలకలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్తోపాటు చార్మీనార్లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్లో ఐదున్నర సెంటీమీటర్లు, సైదాబాద్లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో…
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు 32000 క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దాంతో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 12500 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కుల… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా… లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ…
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయానికి భారీ ఇన్ ఫ్లో వస్తుంది. అయితే శ్రీశైలం గేట్లు ఎత్తడంతో పెరిగిన వరద ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు కు 84,309 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండటంతో,,, అవుట్ ఫ్లో కూడా 84,309 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.40 అడుగులకు…