ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ రోజు రాత్రికి అది తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని… దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఆదివారం అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. పశ్చిమబెంగాల్-ఒడిశా- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వెేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కాబట్టి మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు.