Rahul Gandhi: రాజ్యసభలో అమిత్ షా చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు స్పీచ్లోని కొంత భాగాన్ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తం చర్చను చూస్తే అమిత్ షా ఏం చెప్పారో అర్థమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
Revanth Reddy: తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం (డిసెంబర్ 18, 2024) పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం “చలో రాజ్ భవన్” పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి…
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్ట ప్రకారం జరిగే వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో.. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
Congress: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విచిత్రంగా ప్రవర్తించారు. ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసగించిన సమయంలో మొబైల్ చూడడంలో మునిగిపోయారు. మోడీ ప్రసంగించినంత సేపు ఫోన్ చూస్తూనే ఉన్నారు.
అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో.. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై దానం నాగేందర్ మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ మా బంధువని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరం అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు. బెయిల్ దొరకడం…
Rahul Gandhi: లోక్సభలో భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కార్ సిద్ధాంతంపై విమర్శలు గుప్పించారు.