Rahul Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్ మృతదేహానికి రాహుల్ నివాళులు..
- సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి
- చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేసిన మాధవన్
- అంతకుముందు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన మాధవన్
- త్రిసూర్లో మాధవన్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన రాహుల్ గాంధీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు. ఈ క్రమంలో.. మాధవన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ సోమవారం మహాబలేశ్వర్కు చేరుకున్నారు.
Read Also: Sandhya Theatre stampede:సంధ్య థియేటర్ కి మరో షాక్?
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
కాగా.. ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు త్రిసూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో మాధవన్ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆయన తల్లి సోనియా తరఫున కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ.. మాధవన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సుమారు గంటపాటు తన సంతాపాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాహుల్ గాంధీ పూణే, మహాబలేశ్వర్ల పర్యటన వ్యక్తిగతమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తనను కలవవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాహుల్ సూచించారు.
Read Also: President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మాధవన్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సంతాపం వ్యక్తం చేశారు. మాధవన్ దశాబ్దాలపాటు నిస్వార్థంగా పార్టీకి సేవలందించారని తెలిపారు. ఆయన సేవలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. మాధవన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వేణుగోపాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!