పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇవాళ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ పిల్లగాడు ఆయనకు ఏం తెలవదంటూ వ్యాఖ్యానించారు. వరంగల్ సభలో 4వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశాడని, నాలుగు వేల పెన్షన్ ఇస్తే సంతోషమే కానీ వారు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు.. breaking news, latest news, telugu news, koppula eshwar, rahul gandhi,
కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మల్లు రవి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై అణిచివేతకి నిరసనగా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు ఆయన…
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతడుఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు.
దేశానికి ప్రధాన మంత్రి ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ షరతు పెట్టారు. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అన్నారా లేదంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అజిత్ పవార్ సహా 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్ను కలిశారు.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) ఇన్ఛార్జ్గా కన్హయ్య కుమార్ను కాంగ్రెస్ ఇవాళ (గురువారం) నియమించింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి కన్హయ్య కుమార్ నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.