Kishan Reddy: రాహుల్ గాంధీ ట్వీట్పై కిషన్ రెడ్డి ఫైర్.. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ వైపు భారత అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యం ఉండాలని కోరుకుంటునే మరో వైపు భారతదేశ అంతర్గత విషయాలను బయటి వ్యక్తులు వ్యాఖ్యానించకూడదని కోరుకుంటున్నాడని విమర్శించారు. రాహుల్ కు గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ భారత దేశం పట్ల ప్రేమ ఉందా అని నిలదీశారు. రాజకీయ అంశాల కోసం దేశ రక్షణ భద్రతను లాగటం సిగ్గుచేటని విమర్శించారు.
Karnataka: ఆర్ఎస్ఎస్కు షాకిచ్చిన కర్ణాటక సీఎం
Also Read
రాహుల్ గాంధీ ట్వీట్లో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్పందించారు. “మణిపూర్ మండుతోంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు కూడా భారతదేశ అంతర్గత సమస్యపై చర్చించింది. కానీ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు, రాఫెల్ ద్వారా బాస్టిల్ డే పరేడ్ టిక్కెట్లు దొరికాయి అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మణిపూర్ హింసాకాండపై దాడి చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదే సమయంలో మణిపూర్ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆరోపించారు.
Kottu Satyanarayana: సీఎం జగన్ని విమర్శిస్తే.. ప్రజలే పవన్కి మరోసారి బుద్ధి చెప్తారు
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విసుగు చెందిన వారసుడు అని మేకిన్ ఇండియా ఆశయాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. వారి కాళ్ల వద్దకు రక్షణ ఒప్పందాలు రావడం లేదని నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి గౌరవం లభిస్తే అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!