Kishan Reddy: రాహుల్ గాంధీ ట్వీట్పై కిషన్ రెడ్డి ఫైర్.. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ వైపు భారత అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యం ఉండాలని కోరుకుంటునే మరో వైపు భారతదేశ అంతర్గత విషయాలను బయటి వ్యక్తులు వ్యాఖ్యానించకూడదని కోరుకుంటున్నాడని విమర్శించారు. రాహుల్ కు గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ భారత దేశం పట్ల ప్రేమ ఉందా అని నిలదీశారు. రాజకీయ అంశాల కోసం దేశ రక్షణ భద్రతను లాగటం సిగ్గుచేటని విమర్శించారు.
Karnataka: ఆర్ఎస్ఎస్కు షాకిచ్చిన కర్ణాటక సీఎం
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
రాహుల్ గాంధీ ట్వీట్లో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్పందించారు. “మణిపూర్ మండుతోంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు కూడా భారతదేశ అంతర్గత సమస్యపై చర్చించింది. కానీ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు, రాఫెల్ ద్వారా బాస్టిల్ డే పరేడ్ టిక్కెట్లు దొరికాయి అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మణిపూర్ హింసాకాండపై దాడి చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదే సమయంలో మణిపూర్ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆరోపించారు.
Kottu Satyanarayana: సీఎం జగన్ని విమర్శిస్తే.. ప్రజలే పవన్కి మరోసారి బుద్ధి చెప్తారు
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విసుగు చెందిన వారసుడు అని మేకిన్ ఇండియా ఆశయాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. వారి కాళ్ల వద్దకు రక్షణ ఒప్పందాలు రావడం లేదని నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి గౌరవం లభిస్తే అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!