Kishan Reddy: రాహుల్ గాంధీ ట్వీట్పై కిషన్ రెడ్డి ఫైర్.. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ వైపు భారత అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యం ఉండాలని కోరుకుంటునే మరో వైపు భారతదేశ అంతర్గత విషయాలను బయటి వ్యక్తులు వ్యాఖ్యానించకూడదని కోరుకుంటున్నాడని విమర్శించారు. రాహుల్ కు గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ భారత దేశం పట్ల ప్రేమ ఉందా అని నిలదీశారు. రాజకీయ అంశాల కోసం దేశ రక్షణ భద్రతను లాగటం సిగ్గుచేటని విమర్శించారు.
Karnataka: ఆర్ఎస్ఎస్కు షాకిచ్చిన కర్ణాటక సీఎం
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
రాహుల్ గాంధీ ట్వీట్లో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్పందించారు. “మణిపూర్ మండుతోంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు కూడా భారతదేశ అంతర్గత సమస్యపై చర్చించింది. కానీ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు, రాఫెల్ ద్వారా బాస్టిల్ డే పరేడ్ టిక్కెట్లు దొరికాయి అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మణిపూర్ హింసాకాండపై దాడి చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదే సమయంలో మణిపూర్ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆరోపించారు.
Kottu Satyanarayana: సీఎం జగన్ని విమర్శిస్తే.. ప్రజలే పవన్కి మరోసారి బుద్ధి చెప్తారు
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విసుగు చెందిన వారసుడు అని మేకిన్ ఇండియా ఆశయాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. వారి కాళ్ల వద్దకు రక్షణ ఒప్పందాలు రావడం లేదని నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి గౌరవం లభిస్తే అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?