Mallu Ravi: రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మల్లు రవి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై అణిచివేతకి నిరసనగా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు.. తెలంగాణలో కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read Also: Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ద్వారా దేశం ఐకమత్యంగా ఉండాలని పాదయాత్ర చేశారు.. 4, 500 కిలోమీటర్లు నడిచారు.. రాహుల్ గాంధీ భావి ప్రధానిగా ఉంటే మంచిదని ప్రజలు భావిస్తున్నారు అని మల్లు రవి కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బతీయడానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని చిన్న మాట అన్నందుకు ఇప్పుడు వేదిస్తున్నారు.. చిన్న కేసును పెద్దగా చేసి ప్రభుత్వం అండగా నిలబడి అణిచివేయాలని చూస్తున్నారు అంటూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
Read Also: AP Women Commission: పవన్పై మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు..
దేశంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుంది.. కమలం పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లు రవి పిలుపునిచ్చారు. మోడీ గురించి ఒక్క మాట మాట్లాడినందుకు రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి.. ఇళ్లు ఖాళీ చేయించి.. భద్రతను తగ్గించి.. హైకోర్టుకు పోయినా స్టే ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ నెల 12న జరుగనున్న సత్యాగ్రహ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!