Mallu Ravi: రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మల్లు రవి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై అణిచివేతకి నిరసనగా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు.. తెలంగాణలో కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read Also: Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ద్వారా దేశం ఐకమత్యంగా ఉండాలని పాదయాత్ర చేశారు.. 4, 500 కిలోమీటర్లు నడిచారు.. రాహుల్ గాంధీ భావి ప్రధానిగా ఉంటే మంచిదని ప్రజలు భావిస్తున్నారు అని మల్లు రవి కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బతీయడానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని చిన్న మాట అన్నందుకు ఇప్పుడు వేదిస్తున్నారు.. చిన్న కేసును పెద్దగా చేసి ప్రభుత్వం అండగా నిలబడి అణిచివేయాలని చూస్తున్నారు అంటూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
Read Also: AP Women Commission: పవన్పై మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు..
దేశంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుంది.. కమలం పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లు రవి పిలుపునిచ్చారు. మోడీ గురించి ఒక్క మాట మాట్లాడినందుకు రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి.. ఇళ్లు ఖాళీ చేయించి.. భద్రతను తగ్గించి.. హైకోర్టుకు పోయినా స్టే ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ నెల 12న జరుగనున్న సత్యాగ్రహ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!