Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి సన్నిహితుడిగా భావించే మిఖాయిల్ షాట్స్కీ హత్య చేయబడ్డాడు. ఇతను రష్యన్ మిస్సైల్ డెవలపర్గా ఉన్న ఇతడిని మృతదేహాన్ని మాస్కోలో కనుగొన్నారు. కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన క్షిపణులను డెవలప్ చేసిన రష్యన్ కంపెనీ మార్స్ డిజైన్ బ్యూరో డిప్యూటీ జనరల్ డిజైనర్గా, సాఫ్ట్వేర్ అధిపతిగా షాట్స్కీ ఉన్నారు.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
PM Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని భారత్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించినట్లుగా ఆ దేశం ప్రకటించింది. 2025లో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను నిర్ణయించనున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉసాకోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుతిన్, పీఎం మోడీ ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ సారి రష్యా వంతు అని భారతదేశంలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.
Zelensky: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా కీవ్పై మాస్కో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ చేసిన పోస్ట్లో.. ఈ దాడిపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు.
Breaking news: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యాలోని సుదూర ప్రాంతాల్లో దాడి చేసిందుకు వీలుగా ATACMS క్షిపణుల వాడకానికి అనుమతి ఇచ్చాడు. తాజాగా ఉక్రెయిన్ అన్నంత పనిచేసింది. రష్యాలోని పలు ప్రాంతాలపై ATACMS క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Ukraine War: ఉక్రెయిన్, రష్యాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాలోని సుదూర లక్ష్యలను కొట్టేలా, సుదూర క్షిపణులను ఉపయోగించుకునేందు జో బైడెన్ ఉక్రెయిన్కి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధంలో సంఘర్షణ స్థాయిని పెంచింది.
North Korea-Russia: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా నార్త్ కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో రష్యా సహజ వనరులు మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశం అయ్యారు.
Alexei Zimin: రష్యన్ సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ని విమర్శించే 52 ఏళ్ల అలెక్సీ జిమిన్ అనుమానాస్పద రీతిలో మరణించారు. సెర్బియాలో ఓ హోటల్ గదిలో శవంగా కనిపించాడు. 2014లో రష్యా ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను స్వాధీనం చేసుకోవడంపై జిమిన్ పుతిన్ని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్పై యుద్ధం ముగించాలంటూ పుతిన్కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.