రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ యుద్ధం చాలా ఆందోళనలను కలిగించింది. అయితే తాజాగా రష్యాలో తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది.
Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
Ukraine conflict: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలు మొదలవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించొచ్చని పుతిన్ గురువారం చెప్పారు. యుద్ధం ప్రారంభంలో టర్కీ మధ్యవర్తిత్వం చేసి కొన్ని ఒప్పందాలను చేసుకున్నప్పటికీ, చివరకు అవి ఎన్నడూ అమలు చేయబడలేదని చెప్పారు. ‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ…
PM Modi-Putin telephonic call: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటనపై ఇరు నేతలు చర్చించారు.
Russia: భారత్-రష్యా బంధంపై మరోసారి రష్యా ప్రశంసలు కురిపించింది. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
Joe Biden: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలు సమావేశాల్లో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 సమావేశాల్లో దేశాధినేతలంతా ఫోటోలకు ఫోజ్ ఇస్తుంటే, బైడెన్ మాత్రం వేరే వైపు వెళ్లడం, అక్కడ ఎవరూ లేకున్నా చేతులతో అభివాదం చేయడం వైరల్గా మారింది.
Russia: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్మీలో సహాయక సిబ్బందిగా రిక్రూట్ అయిన భారతీయులను తిరిగి సొంత దేశాని పంపాలని భారత్ చేసిన విజ్ఞప్తిని రష్యా పరిగణలోకి తీసుకుంది.
USA: భారత్-రష్యా సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంబంధాలపై ఆందోళన ఉన్నప్పటికీ అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు. పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని ఆ దేశం అత్యున్నత పౌరపుస్కారంతో గౌరవించింది. ‘‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’’ని ప్రధాని అందుకున్నారు.
PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. యుద్ధం పరిష్కారం కాదని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అన్నారు.