అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా ట్రంప్ ఫోన్లో సంభాషించారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే వైమానిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా పామ్ సండే రోజున కూడా రష్యా భీకరదాడులు చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఎలాన్ మస్క్కి ప్రధాని మోడీ ఫోన్.. ముచ్చటెందంటే!
తాజాగా ఇదే అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే బ్రోకర్ ప్రయత్నాలు విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ ట్రంప్ శాంతి ఒప్పందంపై ఆసక్తి కలిగి ఉన్నారని.. కాకపోతే ఆయనకు ఇతర ప్రాధాన్యతలు చాలా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: తెలంగాణలో మజ్లిస్ జండా ఎగురేయాలని అనుకుంటుంది.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
పారిస్లో యూరోపియన్, ఉక్రెయిన్ నాయకులతో రుబియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రూబియా ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందంపై ఆసక్తి ఉన్నప్పటికీ ట్రంప్కు ఇతర ప్రాధాన్యతలు ఉన్నందున ఆ ప్రయత్నాలు ఆపేస్తామని రూబియో శుక్రవారం పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Jagamerigina Satyam : జగమెరిగిన సత్యం రివ్యూ