(ఆగస్టు 22న ‘ఇడియట్’కు 20 ఏళ్ళు) ‘మాస్ మహరాజా’గా నేడు సాగుతున్న రవితేజకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘ఇట్లు శ్రావణీసుబ్రమణ్యం’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అందువల్ల మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పూరి జగన్నాథ్ ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అప్పు’…