పశ్చిమాసియా యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఠారెత్తిపోతాయని అంతటా భయాందోళనలు చెందారు. కానీ అందుకు భిన్నంగా మంగళవారం తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్లో ఇది కాస్త సామాన్యులకు ఊరట కలిగించే విషయం. ఈరోజు తులం గోల్డ్పై రూ.490 తగ్గగా.. కిలో వెండిపై రూ.20,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ
తులం గోల్డ్పై రూ.490 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,70,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.450 తగ్గడంతో రూ.1,55,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.360 తగ్గడంతో రూ.1,27,520 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇరాన్ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
ఈరోజు సిల్వర్ ధర భారీ ఊరట కలిగించింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధరపై రూ.20,000 తగ్గడంతో రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,15,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది.