Jana Gana Mana: పూరీ – విజయ్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రద్దయ్యిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda Puri Jagannadh Prestigious Project Jana Gana Mana Shelved: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘జన గణ మన’ సినిమా రద్దయ్యిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఈ సినిమా షూటింగ్ని ఆపేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్లే, మేకర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నిజానికి.. లైగర్ సినిమా మీద కాన్ఫిడెంట్తో ‘జన గణ మన’ సినిమాను ప్రారంభించారు. మార్చి చివర్లోనే ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించి, ఆ సమయంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం జూన్ 4వ తేదీన షూటింగ్ మొదలుపెట్టి, ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.
ఆర్మీ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాను సైతం ప్యాన్ ఇండియా సినిమాగానే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలని అనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వల్లే, డైరెక్టర్ పూరీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చాలా గ్రాండ్గా రూపొందించాలని భావించాడు. ఏరికోరి మరి.. హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డేని హీరోయిన్గా రంగంలోకి దింపాడు. పేరుగడించిన టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. కానీ.. లైగర్ బోల్తా పడిన తర్వాత ‘జన గణ మన’ ప్లాన్స్ అన్ని చెల్లాచెదురయ్యాయి. లైగర్ భారీ నష్టాలు మిగల్చడంతో.. జన గణ మన బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చేశాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి.
Also Read
- Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా 'లెజెండ్' శరవణన్... ఈ సారి రచ్చ రచ్చే.!
- Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్... ఐయండిబిలో 8.2 రేటింగ్
- Peddi: 'నాకు, చరణ్కు మధ్య కూడా ఒక లవ్ స్టోరీ ఉంది..' పెద్ది మూవీపై దివ్యేందు శర్మ సెన్సేషనల్ కామెంట్స్!
లైగర్ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, నిర్మాతలు కూర్చొని.. ‘జన గణ మన’ సినిమాపై సుదీర్ఘంగా చర్చలు జరిపారట! చివరికి బడ్జెట్ సరిపోదని తేలడంతో, ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే శ్రేయస్కరమని కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారట! ఒకవేళ ఇదే నిజమైతే, పూరీ జగన్నాథ్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. లైగర్తో చాలా నష్టాలొచ్చాయని కాబట్టి, జన గణ మన నిర్మాణ సమయంలో కచ్ఛితంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, దాంతో ఆ ప్రాజెక్టు ఎటూ కాకుండా పోతుందని అంటున్నారు. అంత రిస్క్ తీసుకోవడం కంటే, ప్రాజెక్ట్ ఆపేయడం బెటరంటున్నారు. అయితే.. దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
-
Heatwave : అలసట, చిరాకు, నిద్రలేమి, ఒత్తిడి, చర్మ సమస్యలు.. ఇది ఎండాకాలం కాదు బాబోయ్.. రోగాల కాలం!
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!