Jana Gana Mana: పూరీ – విజయ్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రద్దయ్యిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda Puri Jagannadh Prestigious Project Jana Gana Mana Shelved: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘జన గణ మన’ సినిమా రద్దయ్యిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఈ సినిమా షూటింగ్ని ఆపేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్లే, మేకర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నిజానికి.. లైగర్ సినిమా మీద కాన్ఫిడెంట్తో ‘జన గణ మన’ సినిమాను ప్రారంభించారు. మార్చి చివర్లోనే ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించి, ఆ సమయంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం జూన్ 4వ తేదీన షూటింగ్ మొదలుపెట్టి, ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.
ఆర్మీ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాను సైతం ప్యాన్ ఇండియా సినిమాగానే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలని అనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వల్లే, డైరెక్టర్ పూరీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చాలా గ్రాండ్గా రూపొందించాలని భావించాడు. ఏరికోరి మరి.. హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డేని హీరోయిన్గా రంగంలోకి దింపాడు. పేరుగడించిన టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. కానీ.. లైగర్ బోల్తా పడిన తర్వాత ‘జన గణ మన’ ప్లాన్స్ అన్ని చెల్లాచెదురయ్యాయి. లైగర్ భారీ నష్టాలు మిగల్చడంతో.. జన గణ మన బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చేశాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి.
Also Read
- Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
- Posani Krishna Murali: 'మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు'
- Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
- Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. 'జై హనుమాన్'లో అసలేం జరుగుతుంది?
లైగర్ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, నిర్మాతలు కూర్చొని.. ‘జన గణ మన’ సినిమాపై సుదీర్ఘంగా చర్చలు జరిపారట! చివరికి బడ్జెట్ సరిపోదని తేలడంతో, ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే శ్రేయస్కరమని కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారట! ఒకవేళ ఇదే నిజమైతే, పూరీ జగన్నాథ్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. లైగర్తో చాలా నష్టాలొచ్చాయని కాబట్టి, జన గణ మన నిర్మాణ సమయంలో కచ్ఛితంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, దాంతో ఆ ప్రాజెక్టు ఎటూ కాకుండా పోతుందని అంటున్నారు. అంత రిస్క్ తీసుకోవడం కంటే, ప్రాజెక్ట్ ఆపేయడం బెటరంటున్నారు. అయితే.. దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!