Jana Gana Mana: పూరీ – విజయ్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రద్దయ్యిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda Puri Jagannadh Prestigious Project Jana Gana Mana Shelved: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘జన గణ మన’ సినిమా రద్దయ్యిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఈ సినిమా షూటింగ్ని ఆపేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్లే, మేకర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నిజానికి.. లైగర్ సినిమా మీద కాన్ఫిడెంట్తో ‘జన గణ మన’ సినిమాను ప్రారంభించారు. మార్చి చివర్లోనే ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించి, ఆ సమయంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం జూన్ 4వ తేదీన షూటింగ్ మొదలుపెట్టి, ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.
ఆర్మీ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాను సైతం ప్యాన్ ఇండియా సినిమాగానే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలని అనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వల్లే, డైరెక్టర్ పూరీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చాలా గ్రాండ్గా రూపొందించాలని భావించాడు. ఏరికోరి మరి.. హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డేని హీరోయిన్గా రంగంలోకి దింపాడు. పేరుగడించిన టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. కానీ.. లైగర్ బోల్తా పడిన తర్వాత ‘జన గణ మన’ ప్లాన్స్ అన్ని చెల్లాచెదురయ్యాయి. లైగర్ భారీ నష్టాలు మిగల్చడంతో.. జన గణ మన బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చేశాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి.
Also Read
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
లైగర్ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, నిర్మాతలు కూర్చొని.. ‘జన గణ మన’ సినిమాపై సుదీర్ఘంగా చర్చలు జరిపారట! చివరికి బడ్జెట్ సరిపోదని తేలడంతో, ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే శ్రేయస్కరమని కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారట! ఒకవేళ ఇదే నిజమైతే, పూరీ జగన్నాథ్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. లైగర్తో చాలా నష్టాలొచ్చాయని కాబట్టి, జన గణ మన నిర్మాణ సమయంలో కచ్ఛితంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, దాంతో ఆ ప్రాజెక్టు ఎటూ కాకుండా పోతుందని అంటున్నారు. అంత రిస్క్ తీసుకోవడం కంటే, ప్రాజెక్ట్ ఆపేయడం బెటరంటున్నారు. అయితే.. దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?