Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ
- ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు
- మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ
- పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యను ఎందుకు ఖండించలేదని మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నిలదీశారు. ‘‘నిశ్శబ్దం తటస్థం కాదు’’ అని పేర్కొన్నారు. అసలెందుకు మౌనం వహించారని తప్పుబట్టారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఒక కాలమ్లో ‘‘టెహ్రాన్తో న్యూఢిల్లీ సంబంధాలు’’, నాగరికత- వ్యూహాత్మకమైనవి’’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Lebanon: బీరూట్ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఖమేనీ హత్యపై భారత ప్రభుత్వం స్పందించకపోవడం అంతర్జాతీయ న్యాయ, సార్వభౌమత్వానికి విరుద్ధమని తెలిపారు. ఇది మౌన సమ్మతిగా భావించబడే ప్రమాదం ఉందని చెప్పారు. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఒక దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్రమైన విఘాతంగా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో భారత్ స్పష్టంగా సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు మద్దతు ఇవ్వకపోవడం దేశ విదేశాంగ విధాన దిశపై సందేహాలు కలిగిస్తోందని అన్నారు.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇరాన్ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
ఆశ్చర్యంగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులను మాత్రం ప్రధాని మోడీ ఖండించారని.. కానీ వాటికి దారితీసిన పరిణామాలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఖమేనీ హత్యకు కొద్ది రోజుల ముందే ప్రధాని మోడీ ఇజ్రాయెల్ను సందర్శించి.. నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం సమయస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా వంటి దేశాలు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్న సమయంలో భారత్ వైఖరి సంప్రదాయ విదేశాంగ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బడ్జెట్ సమావేశాల రెండో విడతలో పార్లమెంటులో చర్చ నిర్వహించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..