Prashanth Varma : గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన చాలా సినిమాలను ప్రకటించాడు. వాటన్నింటికీ అడ్వాన్సుల రూపంలోనే వంద కోట్ల దాకా తీసుకున్నాడని.. ఇప్పుడు తాను కాకుండా వేరే వాళ్లతో డైరెక్షన్ చేయించి తాను పర్యవేక్షిస్తానని చెబుతున్నాడంటూ రూమర్లు వస్తున్నాయి. మాట తప్పడంతో ప్రశాంత్ వర్మ మీద కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు రూమర్లు ఉన్నాయి. ఇక నిన్న ఛాంబర్ లో నిరంజన్…
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సహా పలు నిర్మాణ సంస్థలలో సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలను ఖండిస్తూ, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. “డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ / డీవీవీ దానయ్య నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోలేదు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, అర్థరహితం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం…
హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు నిర్మాతల నుండి ఊహించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘హనుమాన్’ వంటి అతి తక్కువ బడ్జెట్లో, అత్యంత నాణ్యమైన అవుట్పుట్ని ఇచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క వేసేలా ఉంది పరిస్థితి. హనుమాన్ హిట్ అనంతరం ఆయన చేతిలో లెక్కలేనన్ని ప్రాజెక్టులు లైనప్ అవడంతో వరుస…
Teja Sajja : మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తేజసజ్జా. ఆయన చేసిన సినిమాల్లో మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరికొన్ని సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్లు ఇచ్చాడు తేజ. మిరాయ్-2 సినిమా కచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. మొదటి పార్టును మించి ఆ సీక్వెల్ ఉంటుంది. అందులో…
Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక దుబాయ్ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ)…
71 National Film Awards : 2023కు గాను 71వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి ఏడు అవార్డులు వచ్చాయి. అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఏ అవార్డు అందుకున్న వారికి ఎంత ఉంటుంది.. తెలుగులో అవార్డులు వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరు అవార్డు అందుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారుక్…
Allu Arjun : 71వ జాతీయ అవార్డులపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని స్పెషల్ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు నిజంగా అర్హులు. 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న షారుక్.. ఈ అవార్డుతో మరో మెట్టు ఎక్కారు అంటూ విషెస్ తెలిపాడు బన్నీ. అటు 12 ఫెయిల్ తో నేషనల్ అవార్డు…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకోబోతున్నారంట. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ భారీ మైథికల్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే నటులను తీసుకునే పనిలో…