Prasanth Varma : ప్రశాంత్ వర్మ మెడపై అడ్వాన్స్’ల కత్తి?
హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు నిర్మాతల నుండి ఊహించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘హనుమాన్’ వంటి అతి తక్కువ బడ్జెట్లో, అత్యంత నాణ్యమైన అవుట్పుట్ని ఇచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క వేసేలా ఉంది పరిస్థితి. హనుమాన్ హిట్ అనంతరం ఆయన చేతిలో లెక్కలేనన్ని ప్రాజెక్టులు లైనప్ అవడంతో వరుస ప్రకటనలు కూడా చేశారు. ప్రభాస్, రిషబ్ శెట్టి లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు, దాదాపు 10 సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. మరో ఐదారేళ్ల పాటు కొత్త సినిమా ఒప్పుకోలేని విధంగా ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు.
Also Read :Champion : ‘ఛాంపియన్’ టీజర్..ఇదేదో గట్టిగా కొట్టేట్టు ఉందే!
Also Read
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- Dacoit OTT Release Date: అడివి శేష్ 'డెకాయిట్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
- Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
- Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
అయితే ఆ స్పీడ్ ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. హనుమాన్ తరువాత నా సినిమా ‘మీతోనే’ అనే షరతుపై ప్రశాంత్ వర్మ చాలా మంది నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారని అంటున్నారు. ఇండస్ట్రీ టాక్. నిరంజన్ రెడ్డి, సుధాకర్ చెరుకూరి, డి.వి.వి.దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, హంబలే ఫిల్మ్స్ వంటి పేరున్న సంస్థలతో పాటు, కొత్త నిర్మాతలు కూడా ఆయన్ని నమ్మి కోరినంత అడ్వాన్సులు ఇచ్చారని, ఈ అడ్వాన్సులు అన్నీ కలుపుకొంటే దాదాపు రూ.100 కోట్ల వరకూ ఉంటాయని అంచనా అనే ప్రచారం మొదలైంది. ఇంతమందికి ఒకేసారి సినిమా చేయడం అసాధ్యం కాబట్టి, ప్రశాంత్ వర్మ నిర్మాతలకు “నేను దర్శకత్వం చేయను కానీ, కథ ఇస్తాను. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను” అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ తో రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Srikakulam: తొక్కిసలాట ఆలయం కథ..! తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని ఏకంగా గుడి నిర్మించిన భక్తుడు..
అయితే, నిర్మాతలు మాత్రం ఈ ఆప్షన్కి సుముఖంగా లేరు. వాళ్లంతా “చేస్తే ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయాలి, లేదంటే అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాలి” అని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారని అంటున్నారు. అయితే అడ్వాన్సుల రూపంలో వచ్చిన ఆ డబ్బునంతా వర్మ తాను కొత్తగా నిర్మించిన స్టూడియోపై పెట్టుబడి పెట్టారని, ‘హనుమాన్’ విజయం సాధించిన వెంటనే, హైదరాబాద్లో స్థలం కొని, ఖరీదైన ఆఫీస్ నిర్మించారని అంటున్నారు. ఆయన వెనక్కి ఇవ్వడం అయ్యేపని కాదు కాబట్టి నిర్మాతలు మూకుమ్మడిగా ప్రశాంత్ వర్మపై ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది .
తాజావార్తలు
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!