యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్ను నిర్మిస్తోంది. ఈ సెట్లో ప్రభాస్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్…
‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దూకుడు పెంచాడు. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆమెను…
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘సాహో’ తరువాత మరింత పుంజుకుంది. అయితే, సౌత్ సూపర్ స్టార్స్ ఎందరున్నా ఈ తరం బాలీవుడ్ ప్రేక్షకులకి మన జూనియర్ రెబెల్ స్టార్ పై తిరుగులేని క్రేజ్ ఏర్పడి పోయింది. ఉత్తరాది వారికి దక్షణాది అందగాడంటే ‘బాహుబలి’ మాత్రమే. అదే సత్యాన్ని ఋజువు చేసే మరో మైలురాయిని తాజాగా ప్రభాస్ దాటేశాడు! Read Also: ఆసక్తికరంగా ‘విజయ రాఘవన్’ ట్రైలర్ సొషల్ మీడియాలో ఫేస్బుక్ ది ప్రత్యేక స్థానం.…
ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్! ఇంకా చాలా మంది హీరోలకి బోలెడు ఇమేజ్ ఉన్నా కూడా ‘బాహుబలి’ రేంజే వేరు! కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా త్రివిక్రముడిలా పెరిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తరువాత ‘సాహో’ మరింత ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టింది మన టాల్ అండ్ టాలెంటెడ్ స్టార్ కి! అయితే, రాబోయే చిత్రాలు ‘డార్లింగ్’ని మరింత డేరింగ్ గా ప్రజెంట్ చేయబోతున్నాయి… ప్రభాస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న “రాధేశ్యామ్” షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు. ప్రభాస్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ లవ్ డ్రామా విడుదల తేదీని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని బృందం “రాధే శ్యామ్” ఇచ్చిన ప్రకటన ధృవీకరిస్తుంది.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు తీపికబురు అందించాడు దర్శకుడు రాధాకృష్ణ. పాన్ ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్” అప్డేట్ కోసం ఎంతోకాలం నుంచి ఓపికగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ రోజు “త్వరలోనే అప్డేట్” అని ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రాధే శ్యామ్ చివరి షెడ్యూల్తో అన్నీ పూర్తయ్యాయి. మా డార్లింగ్ అభిమానులందరికీ…
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా…
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శనివారం హైదరాబాద్లో జరగబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక…