Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
- మెట్రో స్టేషన్ల అభివృద్ధికి అజిత్ రెడ్డి ఆదేశాలు
- బేగంపేట్ నుంచి రాయదుర్గ్ వరకు క్షేత్రస్థాయి తనిఖీ
- పార్కింగ్, పారిశుధ్యం, ప్రయాణికుల సౌకర్యాలపై ఫోకస్
- తొలి విడతలో 10 స్టేషన్లను మోడల్గా తీర్చిదిద్దే ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు వెంటనే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, పలు కీలక స్టేషన్లను, అక్కడి వీధి స్థాయి వసతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బేగంపేట్ నుండి రాయదుర్గ్ వరకు క్షేత్రస్థాయి పరిశీలన
పర్యటనలో భాగంగా బేగంపేట్, అమీర్ పేట్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లలోని ప్లాట్ఫామ్లు, కాంకోర్స్ ప్రాంతాలను అజిత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై మెట్రో ఇంజనీర్లు , ఆపరేషన్ల నిర్వాహక సంస్థ కియోలిస్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయదుర్గ్ వద్ద ఉన్న స్కైవాక్, ఐటీ కంపెనీలకు ఉన్న కనెక్టివిటీ మార్గాలు , మైండ్స్పేస్ జంక్షన్ వద్ద ప్రయాణికుల రాకపోకలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, అలాగే స్టేషన్ల కింద ఉన్న వాణిజ్య సముదాయాల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
పార్కింగ్, పారిశుధ్య నిర్వహణపై సమీక్ష
మెట్రో స్టేషన్ల కింద ఉన్న పార్కింగ్ స్థలాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, బేగంపేట్, అమీర్ పేట్, రాయదుర్గ్ పార్కింగ్ ఏరియాలను పరిశీలించి అభివృద్ధికి తగిన సూచనలు చేశారు. అలాగే, పిల్లర్ల మధ్య ఉన్న సెంట్రల్ మెరిడియన్ నిర్వహణ , పారిశుధ్య స్థితిగతులపై ఆయన సమీక్షించారు. ప్రయాణికులకు ఇచ్చే సేవలలో స్వచ్ఛత, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్వహణ చూసే ఏజెన్సీల పనితీరును ఇంకా మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రాథమికంగా 10 స్టేషన్ల ఎంపిక , తదుపరి చర్యలు
మెట్రో స్టేషన్లను మరింత మోడల్గా తీర్చిదిద్దేందుకు స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అజిత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా మొదటి విడతలో 10 మెట్రో స్టేషన్లను ఎంపిక చేసి, వాటిని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని మెట్రో స్టేషన్లను కూడా స్వయంగా సందర్శించి, ప్రయాణికులకు అందే సౌకర్యాలు, పార్కింగ్, పారిశుధ్యం , భద్రతను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని తెలిపారు. నగరవాసులకు అత్యంత సురక్షితమైన , ప్రశాంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!