Minister Roja: కృష్ణంరాజు కుటుంబసభ్యుల్ని పరామర్శించిన మంత్రి రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Visited Krishnam Raju Family Members In Mogaltur: మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మొగుల్తూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి రోజా.. కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత ఒక్క కృష్ణంరాజుకే దక్కుతుందని కొనియాడారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని, ఆయన మృతి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణంరాజుకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. భౌతికంగా కృష్ణంరాజు దూరమైనప్పటికీ.. ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరన్నారు. సినిమాల్లో కృష్ణంరాజు రెబల్ స్టార్ అయితే.. రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్నారు. కృష్ణంరాజు ఆశయాలకు తగ్గట్టు ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలని మంత్రి రోజా కోరారు.
మంత్రి రోజాతో పాటు మరో మంత్రి చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి వేణు మాట్లాడుతూ.. సినీ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీరప్రాంతంలో రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సినీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తగిన గుర్తింపు ఇస్తారన్నారు. అనంతరం చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ.. మొగల్తూరులో పుట్టి సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రాణించడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని తెలిపారు. కృష్ణంరాజు గుర్తుగా.. తీరప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామని మాటిచ్చారు. కాగా.. ఈ సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీఎత్తున అభిమానులు పోటెత్తారు. 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టడంతో.. వేలాది సంఖ్యలో అతని ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో.. అక్కడి సందడి వాతావరణం నెలకొంది. విశేషం ఏమిటంటే.. అభిమానుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దీ నాన్-వెజ్ వంటకాలు చేసి పెట్టారు.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!