Minister Roja: కృష్ణంరాజు కుటుంబసభ్యుల్ని పరామర్శించిన మంత్రి రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Visited Krishnam Raju Family Members In Mogaltur: మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మొగుల్తూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి రోజా.. కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత ఒక్క కృష్ణంరాజుకే దక్కుతుందని కొనియాడారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని, ఆయన మృతి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణంరాజుకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. భౌతికంగా కృష్ణంరాజు దూరమైనప్పటికీ.. ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరన్నారు. సినిమాల్లో కృష్ణంరాజు రెబల్ స్టార్ అయితే.. రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్నారు. కృష్ణంరాజు ఆశయాలకు తగ్గట్టు ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలని మంత్రి రోజా కోరారు.
మంత్రి రోజాతో పాటు మరో మంత్రి చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి వేణు మాట్లాడుతూ.. సినీ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీరప్రాంతంలో రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సినీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తగిన గుర్తింపు ఇస్తారన్నారు. అనంతరం చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ.. మొగల్తూరులో పుట్టి సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రాణించడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని తెలిపారు. కృష్ణంరాజు గుర్తుగా.. తీరప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామని మాటిచ్చారు. కాగా.. ఈ సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీఎత్తున అభిమానులు పోటెత్తారు. 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టడంతో.. వేలాది సంఖ్యలో అతని ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో.. అక్కడి సందడి వాతావరణం నెలకొంది. విశేషం ఏమిటంటే.. అభిమానుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దీ నాన్-వెజ్ వంటకాలు చేసి పెట్టారు.
Also Read
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
తాజావార్తలు
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!