టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీఓ 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీఓ వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర. Read Also:సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్ సీనియారిటీ చిచ్చు పెట్టి…
నల్లగొండ జిల్లాలో టీహబ్, టాస్క్ సెంటర్ను మంజూరు చేస్తామని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోని నూతన ఎస్సీ, ఎస్టీ హస్టల్ భవనాలను ప్రారంభించి. టీహబ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నల్లగొండకు ఐటీ హబ్ కేసీఆర్ వల్లనే సాకరమైందన్నారు. హైదరాబాద్కే పరిమితమైన ఐటీని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలనేదే సీఎం కేసీఆర్లక్ష్యమన్నారు. వరంగల్,…
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే…
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి వరంగల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం ఉదయం ఆయన సిద్ధంకాగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సోమవారం కూడా రేవంత్…
ఏపీ మాజీ మంత్రి జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి క్రైస్తవుడు కాదని, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని అపహాస్యం చేస్తున్నాడన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఏ మతం ధర్మం మీద కూడా జగన్ కి విశ్వాసం లేదని ఆయన అన్నారు. ముస్లింలకి షాదీ ముబారక్ లేదన్నారు. Read Also: పీఆర్సీ బ్రహ్మ పదార్థంగా…
ఏపీ సీఎం పుట్టిన రోజే పేదల రక్తాన్ని పీల్చే పథకాన్ని ప్రారంభించారని టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓటిఏస్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేవరకు టీడీపీ పోరాడుతుందన్నారు.ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు కట్టిన ఇళ్లపై దుర్మార్గంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.టీడీపీ హయాంలో రద్దు చేయలేదుఎందుకనీ బొత్స అంటున్నారని, కానీ మీరు ఇంత దుర్మార్గులని ఊహించలేదని అచ్చెన్నాయుడు అన్నారు. కేవలం…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్లా…
జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మేమేదో పాపం చేసినట్టు, అమూల్కి సంపద దోచిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. అమూల్ అనేది ప్రైవేట్ సంస్థ కాదు.. సహకార సంస్థ రాష్ట్రంలో ఉన్న సహకార సంస్థలు అన్నింటిని చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. పాడి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాంసంగం డెయిరీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని మంత్రి పేర్కొన్నారు. Read Also: ఆ…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని అణిచివేయాలని.. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా …కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు…ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు… ఓ రోజు ధరణి…
విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అయిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ ..వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ ఒక మేల్కొలుపు లాంటిదని, వైసీపీ పతనంప్రారంభమయిందన్నారు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో…