నేను సోనియా గాంధీ ,రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చానని జగ్గారెడ్డి అన్నారు.ఆ లేఖ ఎలా లీక్ అయిందో నాకు తెలియదని…ఇది మీడియాలో కూడా వచ్చిందని తెలిపారు. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు జగ్గారెడ్డిని హాజరు కావాలనడంతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖ పై మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా..! లేదా మీరు మీడియా లో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా..ఈ విషయం మీరు ఎందుకు మీడియా ముందు చెప్పలేదు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళి పెద్దపల్లి అభ్యర్థిని అధిష్టానానికి, పార్టీ లో చర్చించకుండా, పార్టీ లైన్ దాటి డిక్లేర్ చేస్తే పీసీసీ ప్రసిడెంట్ క్రమశిక్షణలోకి రాడా అంటూ ప్రశ్నించారు. నా సొంత ఉమ్మడి జిలాల్లో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నాకు చెప్పకుండా కార్యక్రమం డిక్లేర్ చేసి వస్తున్న అని ప్రకటిస్తే క్రమశిక్షణకు రాదా అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
Read Also: సమోవా దీవిలో న్యూ ఇయర్ వేడుకలు
వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి నేను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఈ రోజు వార్తలో చూసాను ఇది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి అది క్రమశిక్షణకు రదా..? క్రమశిక్షణ పాటించని పీసీసీని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఫస్ట్ రేవంత్ రెడ్డి ని పిలిచి తర్వాత నన్ను పిలువండి తప్పకుండా హాజరవుతా అంటూ జగ్గారెడ్డి సీరీయస్ అయ్యారు. చిన్నారెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడారు కాబట్టే నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి మీడియా ద్వారా జవాబు ఇస్తున్నా అని జగ్గారెడ్డి చెప్పారు.