Rajasthan: రాజస్థాన్ దౌసాలో భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. పోలీసులు గురువారం 1,000 కిలోల పేలుడు పదార్థాలతో దౌసాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని రాజేష్ మీనాగా గుర్తించారు. అయితే ఈ పేలుడు పదార్థాలు మొత్తం అక్రమ మైనింగ్ కు సంబంధించినవిగా పోలీస్ అధికారులు నిర్థారించారు. నిందితుడి వద్ద నుంచి 65 డిటోనేటర్లు, 13 వైర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించాయి.…
Jagga Reddy: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎంని కలిశారు జగ్గారెడ్డి. సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎంని కోరారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని కోరారు.
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సమయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంపై కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులు ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసిందని గుర్తుచేశారు.
Mallikarjun Kharge: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ను కదిపేస్తోంది. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్ గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై లోక్ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి తొలగించారు.
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్…
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
PM Modi Speech In Parliament: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. 2008లో పార్లమెంట్ పై తీవ్రవాదుల దాడులను ఎవరూ మర్చిపోలేలని అన్నారు. 2004 నుండి 2014 కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఉగ్రవాదం, హింస, కుంభకోణాలే ఉన్నాయని.. ప్రతీ విషయాన్ని సంక్షోభంగా మార్చడం యూపీఏకు అలవాటు అంటూ మండిపడ్డారు.
PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. విపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. పేపర్లు, టీవీల్లో మోడీని విమర్శించి లబ్ధిపొందలేరు.. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశా.. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది, అది విపక్షాల అంచనాకు అందదు అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాడమే నాకు రక్ష అని.. ఈ…
PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని,…
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును తొలగిస్తుందా..? అని ప్రశ్నించారు. పచ్చదనంలో ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అడిగారు. చైనా చొరబాటుపై ప్రధాని మోదీ మాట్లాడరా..? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా.? అని ప్రశ్నించారు.