Turkey Earthquake: టర్కీ, సీరియాలలో భూప్రళయం.. 24 వేలు దాటిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
More Than 24 Thousand Killed In Turkey Syria Earthquake: భూప్రళయం ధాటికి శిథిలమయమైన టర్కీ, సిరియాలలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ ఆ రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 24 వేలు దాటింది. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండటంతో.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టర్కీలో ఒక్క శుక్రవారంనాడే 100 మందికి పైగా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని చోట్ల.. హృదయ విదారక దృశ్యాలూ కనిపిస్తున్నాయి. బయటపడే మార్గం లేక.. మూత్రం తాగి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. అక్కడి శ్మశానాలు మృతదేహాలతో కిక్కిరిసిపోతున్నాయి.
T20 Womens World Cup: ఆతిథ్య సౌతాఫ్రికాకు షాక్..శ్రీలంక సూపర్ విక్టరీ
Also Read
ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత భీకరమైన భూప్రళయంగా టర్కీ అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. ఈ భూకంపం ధాటికి టర్కీ తీవ్రంగా నష్టపోయిందని, తమకు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా కలిపి శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. ఇదిలావుండగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటిదాకా టర్కీలో 19 వేల మందికిపైగా మరణించారని తేలింది. భవనాలన్నీ శిథిలాలు అవ్వడంతో.. 75 వేల మందికి పైగా జనం నిరాశ్రయులైనట్లు అక్కడి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించారు. 12 వేలకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. సిరియాలో 3,300 కు పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది నిరాశ్రయులు అయినట్లు అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.
Hansika: ఈ హీరోయిన్ తన ఫ్రెండ్ భర్తనే లాగేసుకుందా?
కాగా.. భూకంపం ధాటికి కకావికలమైన టర్కీ, సిరియాలకు భారత్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా టర్కీ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని.. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి కృషి చేస్తూనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో టర్కీ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
-
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్బస్టర్ హిట్.. నాన్న చరణ్కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!