Turkey Earthquake: టర్కీ, సీరియాలలో భూప్రళయం.. 24 వేలు దాటిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
More Than 24 Thousand Killed In Turkey Syria Earthquake: భూప్రళయం ధాటికి శిథిలమయమైన టర్కీ, సిరియాలలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ ఆ రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 24 వేలు దాటింది. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండటంతో.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టర్కీలో ఒక్క శుక్రవారంనాడే 100 మందికి పైగా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని చోట్ల.. హృదయ విదారక దృశ్యాలూ కనిపిస్తున్నాయి. బయటపడే మార్గం లేక.. మూత్రం తాగి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. అక్కడి శ్మశానాలు మృతదేహాలతో కిక్కిరిసిపోతున్నాయి.
T20 Womens World Cup: ఆతిథ్య సౌతాఫ్రికాకు షాక్..శ్రీలంక సూపర్ విక్టరీ
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత భీకరమైన భూప్రళయంగా టర్కీ అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. ఈ భూకంపం ధాటికి టర్కీ తీవ్రంగా నష్టపోయిందని, తమకు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా కలిపి శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. ఇదిలావుండగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటిదాకా టర్కీలో 19 వేల మందికిపైగా మరణించారని తేలింది. భవనాలన్నీ శిథిలాలు అవ్వడంతో.. 75 వేల మందికి పైగా జనం నిరాశ్రయులైనట్లు అక్కడి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించారు. 12 వేలకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. సిరియాలో 3,300 కు పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది నిరాశ్రయులు అయినట్లు అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.
Hansika: ఈ హీరోయిన్ తన ఫ్రెండ్ భర్తనే లాగేసుకుందా?
కాగా.. భూకంపం ధాటికి కకావికలమైన టర్కీ, సిరియాలకు భారత్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా టర్కీ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని.. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి కృషి చేస్తూనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో టర్కీ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!