PM Narendra Modi: 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది.. బురద విసిరితే కమలం అంత వికసిస్తుంది..
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.
Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 ఆలౌట్
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
విపక్షాల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని.. కాంగ్రెస్ పాలనను దగ్గర నుంచి చూశా అని, ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని, ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ భారత దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని నిరాకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గరీబీ హఠావో కేవలం నినాదమే అని, మధ్యవర్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్లేవని తెలిపారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచించిందని.. నేను ఎప్పుడూ రాజకీయాలను లబ్ధి కోసం చూడలేదని ఆయన వెల్లడించారు. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేశామని తెలిపారు. దశాబ్ధాలుగా ఆదివాసీలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని.. బడ్జెట్ లో మా ప్రభుత్వం లక్షా 20 వేల కోట్లను గిరిజనుల కోసం కేటాయించామని పేర్కొన్నారు. 13 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.
గత 3-4 ఏళ్లలో 11 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చామని.. జన్ ధన్ ఖతా ఉద్యమాన్ని ప్రారంభించి.. గత 9 ఏళ్లలో 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచామని సభలో పీఎం మోదీ చెప్పారు. కర్ణాటక కలబురిగిలో 8 లక్షల ఖాతాలతో సహా కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ ఖాతాలను ప్రారంభించామని దీన్ని మల్లిఖార్జున ఖర్గే చూడాలని సూచించారు. ఒకరి ఖాతా మూసేయబడుతోంది.. వారి బాధను అర్థం చేసుకోగలను అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. దేశంలోని 25 కోట్ల కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నిజమైన లౌకికవాదం వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తోందని తెలిపారు. దేశంలో 110 వెనకబడిన జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో విద్యా, మౌళిక సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!