PM Narendra Modi: 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది.. బురద విసిరితే కమలం అంత వికసిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.
Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 ఆలౌట్
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
విపక్షాల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని.. కాంగ్రెస్ పాలనను దగ్గర నుంచి చూశా అని, ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని, ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ భారత దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని నిరాకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గరీబీ హఠావో కేవలం నినాదమే అని, మధ్యవర్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్లేవని తెలిపారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచించిందని.. నేను ఎప్పుడూ రాజకీయాలను లబ్ధి కోసం చూడలేదని ఆయన వెల్లడించారు. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేశామని తెలిపారు. దశాబ్ధాలుగా ఆదివాసీలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని.. బడ్జెట్ లో మా ప్రభుత్వం లక్షా 20 వేల కోట్లను గిరిజనుల కోసం కేటాయించామని పేర్కొన్నారు. 13 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.
గత 3-4 ఏళ్లలో 11 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చామని.. జన్ ధన్ ఖతా ఉద్యమాన్ని ప్రారంభించి.. గత 9 ఏళ్లలో 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచామని సభలో పీఎం మోదీ చెప్పారు. కర్ణాటక కలబురిగిలో 8 లక్షల ఖాతాలతో సహా కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ ఖాతాలను ప్రారంభించామని దీన్ని మల్లిఖార్జున ఖర్గే చూడాలని సూచించారు. ఒకరి ఖాతా మూసేయబడుతోంది.. వారి బాధను అర్థం చేసుకోగలను అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. దేశంలోని 25 కోట్ల కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నిజమైన లౌకికవాదం వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తోందని తెలిపారు. దేశంలో 110 వెనకబడిన జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో విద్యా, మౌళిక సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!