పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని ఆదివారం ఒక అధికారి తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో దోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఎంపీ నబమ్ రెబియా కూడా పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ నల్లధనాన్ని ఆపలేకపోతున్నారని విమర్శించారు.. నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి నిబంధనలు వర్తింవని తెలిసి ప్రైవేటు పరం చేయమని ప్రధానమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, ప్రైవేటు విమానాల్లో అక్రమ నగదు తరలిస్తున్నారని.. దేశంలోని ప్రైవేట్ విమానాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్ చేశారు నారాయణ.. ప్రతి…
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ చార్జి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Narendra Modi: భారత ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ప్రధాని పర్యటన నేడు కొనసాగనుంది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
Rahul with ‘tukde tukde gang’, anurag thakur comments: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. పీఎం మోడీ కి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.