CPI Narayana: ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలి.. అసలు ఏపీకి మోడీ ఎందుకొచ్చారో తెలియదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ నల్లధనాన్ని ఆపలేకపోతున్నారని విమర్శించారు.. నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి నిబంధనలు వర్తింవని తెలిసి ప్రైవేటు పరం చేయమని ప్రధానమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, ప్రైవేటు విమానాల్లో అక్రమ నగదు తరలిస్తున్నారని.. దేశంలోని ప్రైవేట్ విమానాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్ చేశారు నారాయణ.. ప్రతి ఎన్నికల్లో ప్రైవేటు విమానాల ద్వారా డబ్బును రవాణా చేస్తున్నారని ఆరోపించారు.. కేవలం, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రూ.600 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారన్నారు.. మరోవైపు, గంజాయి యథేచ్చగా అక్రమ రవాణా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Posani Krishna Murali : కోర్టు ఆదేశాలు.. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై స్పందించిన నారాయణ.. అసలు ఏపీకి ప్రధానమంత్రి మోడీ ఎందుకు వచ్చారో తెలియదు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. రూ.11 వేల కోట్ల హామీలకే ఆనందంలో ఉన్న సీఎం వైఎస్ జగన్.. విశాఖ ఉక్కు ప్రైవేటుకు అప్పగిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. పోలవరం, ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్తుల పంపిణీపై సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధానిని ప్రశ్నించలేకపోయారని విమర్శించారు. ఇక, పవన్ కల్యాణ్ ను పక్కచూపులు చూడొద్దని తన వైపే చూడమని ప్రధాని చెప్పినట్లుంది అంటూ మోడీ-పవన్ భేటీపై సెటైర్లు వేశారు. ఏపీలో వైకాపా విజయానికి సహకరించేలా ప్రధానమంత్రి వ్యవహరించారని దుయ్యబట్టిన ఆయన.. వైకాపా, బీజేపీ బంధం ఫెవికాల్ లాంటిదేనని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా వేధింపులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాడ్ చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై వైకాపా రాజకీయ దాడులు సరికాదని హితవుపలికారు.. ఏపీలో అధికార పార్టీనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందని.. అమరావతి రాజధాని అన్న వైకాపా నేడు మూడు రాజధానులు అనడం దిగజారుడు తనమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.
తాజావార్తలు
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..