Anurag Thakur: “తుక్డే తుక్డే గ్యాంగ్”తో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul with ‘tukde tukde gang’, anurag thakur comments: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. జెఎన్యు (జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ)లో భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నించిన వ్యక్తులతో కలిసి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ మనస్తత్వం.. వారు ఒక కుటుంబానికి మించి ఏమీ చూడలేదరని అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
Read Also: Marri Shashidhar Reddy Live: కాంగ్రెస్ కి షాక్… బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి ?
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ రాష్ట్రాన్ని అల్లర్ల లేకుండా చేశారని ఆయన ప్రశంసించారు. గుజరాత్ ఎంత అభివృద్ధి చెందిందో.. భారత్ కూడా అంత అభివృద్ధి చెందుతుందని.. గుజరాత్ లో బీజేపీ గెలిస్తే భారత్ పురోగమిస్తుందని మంగ్రోల్ లో జరిగిన బహిరంగ సభలో అనురాగ్ ఠాకూర్ అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, నిజాయితీ ప్రాతిపదికన బీజేపీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విభజించు ప్రాతిపదికన మాత్రమే రాజకీయాలు చేస్తుందని.. వారు కులం, వర్గం, మతాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని అన్నారు.
మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అయితే ఇటీవల రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్ జైలు నుంచి విడుదల కావడానికి బ్రిటీష్ వారికి విధేయుడిగా మారి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటెళ్లకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను శివసేన, బీజేపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!