గత పదేళ్లలో తాను చేసిన కృషి వల్ల ప్రజలకు తన ప్రభుత్వంపై అపారమైన విశ్వాసం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చెప్పారు. ఎందుకంటే ఓటు బ్యాంకు పరిగణనలు వారి అభివృద్ధి కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తూ పౌరుల "మై బాప్" లాగా వ్యవహరించినందుకు గత పాలనలను తప్పుపట్టారు.
Henry Kissinger: ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ కిస్సింజర్ తన 100వ ఏట కన్నుమూశారు. భారత్తో అమెరికా బంధాన్ని మరింతగా బలపరుచుకోవాలని కోరుకున్న నేతగా కిస్సింజర్కి పేరుంది. ఈ ఏడాది జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ యూఎస్ పర్యటనలో వీల్ చైర్లో ఉండీ కూడా కిస్సింజర్ హాజరయ్యారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లంచ్లో మోడీ స్పీచ్ వినేందుకు ఆయన…
PM Modi Tweet about Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ను ఎన్నికల సంఘం (ఈసీ) షురూ చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే చేరుకున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే భారీ క్యూ ఉంది. చాలా మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియ్గించుకుంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.26…
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు.…
PM Modi: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ విజయవంతమైంది. ఉత్తరకాశీలో నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో 41 మంది అందులోనే చిక్కుకుపోయారు. గత 17 రోజులుగా అందులో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా ఉండాలని దేశం మొత్తం ప్రార్థించింది. తాజాగా ఈ రోజు 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.
Rozgar Mela: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోతున్న 51,000 మందికి ‘రోజ్గార్ యోజన’ కింద జాబ్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 30న ప్రధాని చేతుల మీదుగా వారిందకిరి ఉద్యోగ నియామక పత్రాలను అందుకోనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని మంగళవారం పీఎం కార్యాలయం తెలిపింది. 'రోజ్గార్ మేళా'లో భాగంగా దేశవ్యాప్తంగా 37 ప్రదేశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నియామకాలు జరుగుతున్నాయని…
Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అగ్ర నేతలంతా ఆఖరి అస్త్రాలను ఓటర్ల పై ప్రయోగిస్తున్నారు.
రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5…