Udhayanidhi Stalin : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ చరిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. బీజేపీ అఖండ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ సంబరాల్లో మునిగితేలుతుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ షాక్కు గురయ్యాయి.
PM Modi: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో అధికారం చేపట్టబోతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోడీ ‘చారిత్రక, అపూర్వ’ విజయంగా కొనియాడారు.
PM Narendra Modi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన 4 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పని చేస్తూనే ఉంటుందని ప్రధాని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని అన్నారు. కాగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని, దానిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Melodi: యూఏఈ దుబాయ్ వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు( COP28)ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టను రీట్వీట్ చేస్తూ..‘‘ స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాశారు.
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకస్థాపన కోసం వడివడిగా పనులు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా శ్రీరామ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది. ఇప్పటికే అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక అందించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ- ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫోటో ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఇరువురి మధ్య స్నేహాబంధంపై నెటిజన్స్ చర్చిస్తున్నారు.
PM Modi: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి వెళ్లారు. COP28 సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రధాని భేటీ చర్చనీయాంశం అయింది. హమాస్ యుద్దంలో ప్రభావితమైన ప్రజలకు మానవతా సాయం నిరంతరం అందించాల్సినఅ అవసరాన్ని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.
COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్కు వెళ్లనున్న సందర్భంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది.