PM Modi: నేడు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని మోడీ వర్చువల్ గా భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడబోతున్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రతో పాటు నడుస్తున్న ప్రచార రథాల్లో ప్రధాని నేరుగా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ యదువంశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పార్టీ అధికారులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు, బ్లాక్ హెడ్లు, గ్రామపెద్దలు, స్థానిక పౌరులతో పాటు ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం ఉంది.
Read Also: OTT Release Movies: సంక్రాంతి కానుకగా ఈ వారం ఓటీటీలో 29 సినిమాలు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
అయితే, నవంబర్ 15, 2023న ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ లబ్ధిదారులతో ప్రధాన మంత్రి మోడీ క్రమం తప్పకుండా మాట్లాడుతున్నారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు జరిగింది. ఇదే కాకుండా, గత నెలలో వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి వరుసగా రెండు రోజులు (డిసెంబర్ 17-18 తేదీలలో) ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ లబ్ధిదారులతో ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన పథకాలలో సంపూర్ణతను సాధించే లక్ష్యంతో ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ దేశవ్యాప్తంగా చేపట్టబడుతోంది. ఈ పథకాల ద్వారా ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సకాలంలో చేరేలా చూస్తారు.
Read Also: Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
అలాగే, ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్రలో దాదాపు 10 కోట్ల మందికి పైగా జనం పాల్గొన్నారు. ఇది ప్రారంభమైన 50 రోజుల్లోనే అద్భుతమైన రికార్ట్ సృష్టించింది.. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే ఉమ్మడి దృక్పథంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడంలో ఈ యాత్రపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని ప్రధాని మోడీ తెలియజేశారు.
తాజావార్తలు
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!