Maldives: మోడీపై మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం.. వాటితో మాకు సంబంధం లేదన్న అక్కడి ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడాన్ని మాల్దీవులు తట్టుకోలేకపోతోంది. ప్రధాని లక్ష్యంగా మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని ‘‘విదూషకుడు, తోలుబొమ్మ’’ అంటూ ఆమె ఎక్స్లో కామెంట్ చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పోస్టును తొలగించింది. అయితే ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని భారత్, మాల్దీవులు ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. భారత హైకమిషనర్ ఈ విషయాన్ని మాలేలోని మహ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సంప్రదించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై మయిజ్జూ ప్రభుత్వంపై సొంతదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడి ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక విదేశీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా భారత్ తమ మిత్రదేశమని, ఈ వివాదానికి అధ్యక్షుడు మయిజ్జూ దూరంగా ఉండాలని సూచించారు.
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
వివాదం పెద్దది కావడంతో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి ప్రభుత్వం తప్పుపడుతూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రి షియునా చేసిన వ్యాఖ్యలకి దూరంగా ఉంటూ.. ఈ వ్యాఖ్యలకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. ‘‘విదేశీ నాయకులు, ఉన్నతస్థాయి వ్యక్తులపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలుసు. ఈ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవి, మాల్దీవుల ప్రభుత్వానికి అవి ప్రాతినిధ్యం వహించవు’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాస్వామ్య, బాధ్యతాయుతమైన పద్ధతిలో భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించాలని ప్రభుత్వం విశ్వసిస్తోందని, ఇది ద్వేషం, ప్రతికూలత వ్యాప్తి చెందకుండా మాల్దీవులు, దాని అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధాలకు ఆటంకం కలిగించకుండా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడదని తెలిపింది.
- Tags
- india
- Lakshadweep
- Maldives
- PM Modi
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!