Maldives: మోడీపై మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం.. వాటితో మాకు సంబంధం లేదన్న అక్కడి ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడాన్ని మాల్దీవులు తట్టుకోలేకపోతోంది. ప్రధాని లక్ష్యంగా మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని ‘‘విదూషకుడు, తోలుబొమ్మ’’ అంటూ ఆమె ఎక్స్లో కామెంట్ చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పోస్టును తొలగించింది. అయితే ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని భారత్, మాల్దీవులు ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. భారత హైకమిషనర్ ఈ విషయాన్ని మాలేలోని మహ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సంప్రదించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై మయిజ్జూ ప్రభుత్వంపై సొంతదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడి ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక విదేశీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా భారత్ తమ మిత్రదేశమని, ఈ వివాదానికి అధ్యక్షుడు మయిజ్జూ దూరంగా ఉండాలని సూచించారు.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
వివాదం పెద్దది కావడంతో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి ప్రభుత్వం తప్పుపడుతూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రి షియునా చేసిన వ్యాఖ్యలకి దూరంగా ఉంటూ.. ఈ వ్యాఖ్యలకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. ‘‘విదేశీ నాయకులు, ఉన్నతస్థాయి వ్యక్తులపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలుసు. ఈ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవి, మాల్దీవుల ప్రభుత్వానికి అవి ప్రాతినిధ్యం వహించవు’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాస్వామ్య, బాధ్యతాయుతమైన పద్ధతిలో భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించాలని ప్రభుత్వం విశ్వసిస్తోందని, ఇది ద్వేషం, ప్రతికూలత వ్యాప్తి చెందకుండా మాల్దీవులు, దాని అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధాలకు ఆటంకం కలిగించకుండా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడదని తెలిపింది.
- Tags
- india
- Lakshadweep
- Maldives
- PM Modi
తాజావార్తలు
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!