Maldives: మోడీపై మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం.. వాటితో మాకు సంబంధం లేదన్న అక్కడి ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడాన్ని మాల్దీవులు తట్టుకోలేకపోతోంది. ప్రధాని లక్ష్యంగా మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని ‘‘విదూషకుడు, తోలుబొమ్మ’’ అంటూ ఆమె ఎక్స్లో కామెంట్ చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పోస్టును తొలగించింది. అయితే ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని భారత్, మాల్దీవులు ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. భారత హైకమిషనర్ ఈ విషయాన్ని మాలేలోని మహ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సంప్రదించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై మయిజ్జూ ప్రభుత్వంపై సొంతదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడి ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక విదేశీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా భారత్ తమ మిత్రదేశమని, ఈ వివాదానికి అధ్యక్షుడు మయిజ్జూ దూరంగా ఉండాలని సూచించారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
వివాదం పెద్దది కావడంతో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి ప్రభుత్వం తప్పుపడుతూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రి షియునా చేసిన వ్యాఖ్యలకి దూరంగా ఉంటూ.. ఈ వ్యాఖ్యలకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. ‘‘విదేశీ నాయకులు, ఉన్నతస్థాయి వ్యక్తులపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలుసు. ఈ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవి, మాల్దీవుల ప్రభుత్వానికి అవి ప్రాతినిధ్యం వహించవు’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాస్వామ్య, బాధ్యతాయుతమైన పద్ధతిలో భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించాలని ప్రభుత్వం విశ్వసిస్తోందని, ఇది ద్వేషం, ప్రతికూలత వ్యాప్తి చెందకుండా మాల్దీవులు, దాని అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధాలకు ఆటంకం కలిగించకుండా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడదని తెలిపింది.
- Tags
- india
- Lakshadweep
- Maldives
- PM Modi
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!