Hardik Pandya: మాల్దీవుల వివాదంపై స్పందించిన హర్దిక్ పాండ్యా.. ‘‘ తర్వాతి హాలిడే లక్షదీవుల్లోనే’’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులను సందర్శించారు. అక్కడ ఉన్న సుందరమైన బీచుల్లో ఆయన పర్యటించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షదీవుల్లో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే దీనిపై మాల్దీవుల్లోని పలువురు నేతలు మోడీని, భారతీయుల్ని ఉద్దేశిస్తూ అవమానకరమైన పోస్టుల్ని పెట్టారు. ఇది వివాదానికి కారణమైంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్ వంటి వారు ప్రధాని మోడీకి మద్దతు తెలిపారు. లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రమోట్ చేసేలా పిలుపునిచ్చారు.
Read Also: Breaking News: మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ వివాదంపై స్పందించారు. భారత్ గురించి వారు ఏం మాట్లాడుతున్నారో చూస్తే బాధగా ఉంది. అందమైన సమద్ర వాతావరణానికి, అందమైన బీచులకు లక్షద్వీప్ పర్ఫెక్ట్ గేట్ వే అంటూ తన తదుపరి హాలిడే కోసం లక్షదీవుల్ని సందర్శిస్తానని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ లక్షదీవుల్ని సందర్శించడంపై అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మరియం షియునా పీఎం మోడీని ఉద్దేశిస్తూ విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈమె చేసిన సోషల్ మీడియా పోస్టుపై భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఆమె ఈ పోస్టును డిలీల్ చేసింది. ఆ దేశ ఎంపీ జహీద్ రమీజ్ తన అక్కను వెళ్లగక్కాడు. పర్యాటకంలో తమతో భారత్ పోటీ పడాలన్న ఆలోచన భ్రమే అని, మా దేశంలో అందించే సర్వీస్ ఎలా అందించగలరు..? పరిశుభ్రంగా ఎలాం ఉంచగలరు..? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ‘బాయ్కాట్ మాల్దీవిస్’ హాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పలువురు ఈ దేశ టూర్ని రద్దు చేసుకుంటున్నారు.
Extremely sad to see what’s being said about India. With its gorgeous marine life, beautiful beaches, Lakshadweep is the perfect get away spot and surely a must visit for me for my next holiday 🫶 #ExploreIncredibleIndia pic.twitter.com/UA7suQArLB
— hardik pandya (@hardikpandya7) January 7, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!