Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రి చేసి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. 32 చ.కి.మీ విస్తీర్ణంలో 36 దీవులతో కూడిన లక్షద్వీప్లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని పర్యటన చేయడం ఆ దేశానికి నచ్చడం లేదు. మాల్దీవులు ఎంపీ జాహీద్ రమీజ్ తన అక్కసును వెళ్లగాక్కారు. తన ట్వీట్ లో ‘‘ భారత్ మాల్దీవులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది’’ అని అన్నారు. అంతే కాకుండా ‘‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సర్వీస్ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు?అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
లక్షద్వీప్లో ప్రధాని మోడీ స్నార్కెలింగ్ ఫోటోలు వైరల్ అయిన తర్వాత మాల్దీవుల మంత్రి మరో ట్వీట్ చేశారు. ఆ దేశ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీని తోలుబొమ్మ అని కామెంట్ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ట్వీట్ని డిలీట్ చేశాడు.
మయిజ్జూ ప్రభుత్వంలోని నేతలు ఇలా ప్రధాని మోడీని కామెంట్ చేయడాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆదివారం ఖండించారు. మంత్రి మరియం షియనా ఉపయోగించిన భాష భయంకరంగా ఉందని, భారత్ మన మిత్రుడని అన్నారు. అధ్యక్షుడు మయిజ్జూ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే మాల్దీవుల తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!