Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రి చేసి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. 32 చ.కి.మీ విస్తీర్ణంలో 36 దీవులతో కూడిన లక్షద్వీప్లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని పర్యటన చేయడం ఆ దేశానికి నచ్చడం లేదు. మాల్దీవులు ఎంపీ జాహీద్ రమీజ్ తన అక్కసును వెళ్లగాక్కారు. తన ట్వీట్ లో ‘‘ భారత్ మాల్దీవులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది’’ అని అన్నారు. అంతే కాకుండా ‘‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సర్వీస్ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు?అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
లక్షద్వీప్లో ప్రధాని మోడీ స్నార్కెలింగ్ ఫోటోలు వైరల్ అయిన తర్వాత మాల్దీవుల మంత్రి మరో ట్వీట్ చేశారు. ఆ దేశ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీని తోలుబొమ్మ అని కామెంట్ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ట్వీట్ని డిలీట్ చేశాడు.
మయిజ్జూ ప్రభుత్వంలోని నేతలు ఇలా ప్రధాని మోడీని కామెంట్ చేయడాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆదివారం ఖండించారు. మంత్రి మరియం షియనా ఉపయోగించిన భాష భయంకరంగా ఉందని, భారత్ మన మిత్రుడని అన్నారు. అధ్యక్షుడు మయిజ్జూ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే మాల్దీవుల తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!