Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్పై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రి చేసి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. 32 చ.కి.మీ విస్తీర్ణంలో 36 దీవులతో కూడిన లక్షద్వీప్లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని పర్యటన చేయడం ఆ దేశానికి నచ్చడం లేదు. మాల్దీవులు ఎంపీ జాహీద్ రమీజ్ తన అక్కసును వెళ్లగాక్కారు. తన ట్వీట్ లో ‘‘ భారత్ మాల్దీవులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది’’ అని అన్నారు. అంతే కాకుండా ‘‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సర్వీస్ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు?అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
లక్షద్వీప్లో ప్రధాని మోడీ స్నార్కెలింగ్ ఫోటోలు వైరల్ అయిన తర్వాత మాల్దీవుల మంత్రి మరో ట్వీట్ చేశారు. ఆ దేశ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీని తోలుబొమ్మ అని కామెంట్ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ట్వీట్ని డిలీట్ చేశాడు.
మయిజ్జూ ప్రభుత్వంలోని నేతలు ఇలా ప్రధాని మోడీని కామెంట్ చేయడాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆదివారం ఖండించారు. మంత్రి మరియం షియనా ఉపయోగించిన భాష భయంకరంగా ఉందని, భారత్ మన మిత్రుడని అన్నారు. అధ్యక్షుడు మయిజ్జూ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే మాల్దీవుల తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..