Maldives: మోడీపై కామెంట్స్.. ముగ్గురు మాల్దీవ్స్ మంత్రుల సస్పెండ్.. నిజమెంతా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల లక్షద్వీప్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఈ పర్యటనపై మాల్దీవుల ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఈ రోజు సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక మీడియా ప్రకారం, మంత్రులు మరియం షియునా, మల్షా , హసన్ జిహాన్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అలాంటిదేం లేదని సస్పెన్షన్ వార్తల్ని ఆ దేశ మంత్రి హసన్ జిహాన్ తిరస్కరించారు.
ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు ‘బాయ్కాట్ మాల్దీవులు’ అనే హాష్ట్యాగ్ని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ దేశానికి వెళ్లాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ఇండియన్స్ ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ప్రధాని మోడీకి మద్దతుగా అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, సచిన్ టెండూల్కర్ వంటి వారు లక్షదీవుల టూరిజానికి మద్దతు తెలుపుతున్నారు.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
అంతకుముందు, ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన విషయాన్ని భారత్, మాల్దీవుల ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. దీనిపై స్పందించిన అక్కడి మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఓ ప్రకటనలో తెలియజేసింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రుల సస్పెన్షన్ జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Breaking News: మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షదీవులకు వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతే కాకుండా అక్కడి పర్యాటకాన్ని ప్రమోట్ చేశారు. మాల్దీవుల లాగే బీచ్ టూరిజానికి లక్షదీవులు వేదికగా ఉన్నాయి. దీంతో ప్రధాని ఇలా చేయడంపై మాల్దీవుల్లోని ప్రభుత్వంలోని నేతలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ప్రతీ ఏడాది ఇండియా నుంచే ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తుంటారు. ఈ దేశానికి ప్రధాన ఆదాయం టూరిజమే.
ఇదిలా ఉంటే మంత్రి మరియం షియునా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధనిని విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈమె పోస్టుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తర్వాత దీనిని డిలీట్ చేసింది. ఆ దేశానికి చెందిన రాజకీయ నేత జహిద్ రమీజ్ ప్రధాని లక్షద్వీప్ టూర్ని ప్రస్తావిస్తూ.. ‘‘డబ్బు సంపాదించడానికి శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థల్ని భారత్ కాపీ కొడుతుందని’’ ఆరోపించారు. భారత్ ఆలోచన భ్రమ కలిగిస్తోందని, వారు మేము అందించే సేవల్ని ఎలా అందిస్తారు.. వారి గదుల్లో వాసన వస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మహ్మద్ మయిజ్జు ప్రభుత్వం ఏ దేశానికి కీలుబొమ్మ కాదని, అది చైనా అయినా, భారత దేశం అయినా అని అన్నారు.
తాజావార్తలు
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..