Elon Musk: ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టెక్ ఆంత్రప్రెన్యూర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషెస్ తెలిపారు.
Russia: భారత్-రష్యా బంధంపై మరోసారి రష్యా ప్రశంసలు కురిపించింది. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వరస ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో రెచ్చిపోతున్నారు.
BJP: లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడంతో అప్పటి నుంచి ఆ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో రాష్ట్రాలలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను కమలం పార్టీ నిర్వహిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేస్తారని ప్రతిపక్షాలు పుకార్లు పుట్టించాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు.
ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోడీ దానికి సరైన సారథి అంటూ విమర్శలు గుప్పించారు.
PM Modi: ఐక్యరాజ్య సమితి 79వ తేదీన సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబర్ 26న మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం.
హిమాలయ దేశంలో రాజకీయ సుస్థిరతను కల్పించే భయంకరమైన సవాలును ఎదుర్కొంటున్న కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ సోమవారం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్లోని అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది.