Kangana Ranaut: మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడింది..
- ప్రధాని మోడీపై ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు
- మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడింది- కంగనా రనౌత్
- ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..
- ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం- కంగనా
- పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై అందరూ ఆందోళన చెందేవారు- కంగనా రనౌత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీపై ఎంపీ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. ఇప్పుడు మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల క్రితం దేశ ఆర్థిక వ్యవస్థపై అందరూ ఆందోళన చెందేవారని కంగనా పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..
Also Read
లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. “నేను ఈ పార్లమెంటుకు కొత్త సభ్యురాలిని, కానీ ఇటీవలి ఎన్నికల ప్రాముఖ్యత గురించి నాకు బాగా తెలుసు. మోడీ వరుసగా మూడుసార్లు గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు.” పదేళ్ల క్రితం మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసునని.. దేశం మొత్తం ఆందోళన చెందిందని.. అయితే 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుని ఇప్పుడు మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.” అన్నారు. అంతేకాకుండా.. తన ప్రసంగంలో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ సవాళ్లను కూడా ప్రస్తావించారు. జీరో అవర్లో హిమాచల్ ప్రదేశ్లో వరద సంక్షోభంపై కంగనా రనౌత్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. “గత ఏడాది పెద్ద వరదలు ఎదుర్కొన్నాం. కానీ నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి కొనసాగుతోంది.” అని తెలిపారు.
Bengaluru: హాస్టల్లో యువతి హత్య.. సీసీకెమెరాలో రికార్డ్
అంతకు ముందు ఆరు దశాబ్దాల్లో చేసిన పని కంటే.. గత 10 ఏళ్లలో చేసిన పని చాలా ఎక్కువ అని కంగనా రనౌత్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని రోడ్లు కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో నిర్మించారని.. ఇప్పుడు తమ రాష్ట్రంలో ఎయిమ్స్, ఐఐఐటీ తదితర ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇన్స్టిట్యూట్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. “మన హిమాచల్ ప్రదేశ్ బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందింది.. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉంది” అని కంగనా రనౌత్ తన రాష్ట్ర విజయాలను సగర్వంగా చెప్పింది. మండిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని.. పర్యాటకాన్ని పెంచాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!