NITI Aayog: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం..
- నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం..
- వికసిత భారత్ 2047’ విజన్పై ఈ మీటింగ్ లో చర్చ..
- నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NITI Aayog: నీతి ఆయోగ్ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగబోతుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశాలపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ యంత్రాంగాలను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు.
Read Also: Off The Record: ఢిల్లీ ధర్నాకు డుమ్మా.. బాలినేని భవిష్యత్తు ఎటువైపు..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక, వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో నీతి అయోగ్ మీటింగ్ లో సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న భారత్ను 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడంపైనా ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. ఈ పాలకమండలి సమావేశంలో 2023 డిసెంబరు 27- 29 తేదీల్లో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో సమావేశం చేసిన సిఫార్సులపైనా కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు నాణ్యమైన విద్యుత్తు, శుద్ధి చేసిన నీరు, నాణ్యమైన వైద్యసేవలు, అందుబాటులో పాఠశాలలు ఉంచేందుకు ఏం చేయాలన్నదానిపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు. నేటి (శనివారం) నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఇతర సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: Astrology: జులై 27, శనివారం దినఫలాలు
కాగా, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, చంద్రబాబు, ఏక్ నాథ్ షిండే, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఈ మీటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయించడంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్దరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖూ ఇందులో పాల్గొనలేదు.. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!