ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకం కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్కు బీఎస్పీ అధినేత మాయావతి జై కొట్టారు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు తీసుకురానున్నారు.
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది.
Viksit Bharat Fellowship: బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వికాస్ భారత్ ఫెలోషిప్ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా, అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన, అసాధారణ నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడం లక్ష్యంగా వికాస్ భారత్ ఫెలోషిప్ మొత్తం 25 ఫెలోషిప్లను అందిస్తుంది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఫెలోషిప్ నాన్-ఫిక్షన్ పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పిల్లల సాహిత్యం, కాఫీ టేబుల్ పుస్తకాలతో…
Donald Trump and Pm Modi Meeting: అమెరికాలోని మిచిగాన్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అమెరికా వాణిజ్యంపై మాట్లాడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తానని ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మాటలకి ఇప్పుడు ప్రాచుర్యం ఏర్పడింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోడిని కలుస్తానని…
Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
J&K Assembly Poll: జమ్ముకశ్మీర్లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పౌరులు "పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ"ను జరుపుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోడీ యూఎస్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21-23 మధ్య అమెరికాలో ప్రధాని మోడీ ఉన్నారు. క్వాడ్ మీట్లో మోడీ పాల్గొంటారు.
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. అన్నదానాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.