Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్లో ముస్లిమేతరులు ఎందుకు?
- వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పలు ప్రశ్నలు
- కాశీ బోర్డులో అందరూ హిందువులే ఉన్నారు
- వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎందుకని ప్రశ్న
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు అజెండాలు సృష్టించి.. ప్రచారం చేస్తుందన్నారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 9 లక్షల 40 ఎకరాల భూమి ఉందని.. కానీ ఇప్పటికీ ఈ భూమిని లాక్కున్నట్లు పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నాయన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కాదు.. వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చిందన్నారు.
READ MORE: Delhi: మరో ఉద్యోగిని బలి తీసుకున్న పని ఒత్తిడి.. హెచ్డీఎఫ్సీ ఎంప్లాయి అనుమానాస్పద మృతి!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
హిందూ మతంలో ఎవరైనా ఎప్పుడైనా విరాళం ఇవ్వవచ్చు.. కానీ ముస్లిం సమాజంలో ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీలో 8 నుంచి 9 మంది ముస్లిమేతరులను ఎందుకు నియమించాలనుకుంటున్నారు? అని అడిగారు. యూపీలోని కాశీ బోర్డులో సభ్యుడు తప్పనిసరిగా హిందువు అయి ఉండాలి అని స్పష్టంగా రాసి ఉందని.. కాబట్టి వక్ఫ్ బోర్డులోకి హిందువులను ఎందుకు తీసుకురావాలని ఒవైసీ ప్రశ్నించారు. తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉండటం వల్ల సమస్య ఏర్పడింది కానీ.. ముస్లిం మతంలో భాగమైన వక్ఫ్ బోర్డుపై ఎందుకు అలా స్పందించడం లేదు అని ప్రశ్నించారు.
READ MORE:Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. మరోపైపు వక్ఫ్ బిల్లుపై వచ్చిన కోటి మందికి పైగా ఫీడ్బ్యాక్పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆగస్టు 8న వక్ఫ్ బిల్లు 2024ను లోక్సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, సమాజ్వాదీ వంటి ప్రతిపక్షాలు ఈ బిల్లును ముస్లిం వ్యతిరేక బిల్లుగా అభివర్ణించాయి. విపక్షాల మధ్య ఈ బిల్లు లోక్సభలో ఎలాంటి చర్చ లేకుండానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపబడింది. బిల్లును మెరుగుపరచడానికి జేఏసి అభిప్రాయాన్ని కోరింది. ఇప్పటి వరకు 1.25 కోట్ల సూచనలు వచ్చాయి. అయితే, నిషికాంత్ దూబే ఫీడ్బ్యాక్ సంఖ్యపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ లెక్కలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని దూబే అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో