రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సింగపూర్ చేరుకున్నారు. బుధవారం బ్రూనై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. సింగపూర్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ డోలు వాయించి ఉత్సాహ పరిచారు. అలాగే ఎన్నారైలతో కలిసి ముచ్చటించారు. ఆటోగ్రాఫ్లు ఇచ్చారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం వాయిదా వేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై మోడీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని వెల్లడించారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించిందన్నారు.
PM Modi @ Brunei: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (మంగళవారం) బ్రూనై దేశానికి చేరుకున్నారు. మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు.
Congress: కుల గణనను ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.
PM Modi To Visit Brunei: ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బ్రూనైలో పర్యటించనున్నారు. బుధవారం సింగపూర్లో పర్యటిస్తారు. బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు సింగపూర్తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు బ్రూనైలో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటన బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే బ్రూనై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి బోల్కియా ఆతిథ్యం ఇవ్వనున్నారు.
పారిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోఢీ ఆదివారం ఫోన్లో మాట్లాడి వారి కృషిని అభినందించారు. అథ్లెట్లు మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్ మరియు రుబీనా ఫ్రాన్సిస్లతో ప్రధాని మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు.
Vande Bharat Trains:’ మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరట్ – లక్నో, మదురై – బెంగళూరు, చెన్నై – నాగర్ కోయిల్ లకు 3 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు…
Narendra Modi: ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సు ప్రారంభమైంది. ఈ న్యాయ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది.. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు.